పేజీలు

27, ఫిబ్రవరి 2012, సోమవారం

కమణీయం ఆ శిల్ప కళా సౌందర్యం















రుద్రేశ్వరుడు
ఆలయ ప్రాంగణం లోని ఒక మండపం
ఆలయంలోని పై కప్పు లోని భాగం
ఆలయం వెలుపల వినాయకుడు
నాగకన్య
అప్సరస



ఆలయ గోపురం

గత శివరాత్రి రోజున వరంగల్ జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళాను. ఆ రోజున లింగ దర్శనం చేసుకోవడం ఒక పుణ్య కార్యమైతే, అదే సందర్భంలో ఒక అద్భుత శిల్పకళా సంపదను చూడటం అదృష్టం. వరంగల్ నుంచి డెభై కిలోమీటర్ల దూరంలో, ఏటూరు నాగారం వెళ్ళే దారిలో, పాలంపేట గ్రామంలో ఉంది ఈ రామప్ప దేవాలయం. మేడారం జాతరకు వెళ్ళాలన్నా ఈ మార్గంలోనే వెళ్ళాలి.
శివరాత్రి కాబట్టి కాస్త హడావిడి కనిపించింది. గుడికి వెళ్ళే దారిలో కొన్ని దుకాణాలు కూడా వెలిసాయి. మామూలు రోజుల్లో ఎ హడావిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో, గత వైభవం గంభీరంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు, రుద్రేశ్వరుడు కైలాసం నుంచి రామేశ్వరానికి వెళ్తూ, దారిలో నందీశ్వరునితో సహా విశ్రమిస్తున్నట్టు ఉంటుంది.
రామప్ప దేవాలయ దర్శనం భక్తులకు, సౌందర్య ఆరాధకులకు ఏకకాలంలో తృప్తినిస్తుంది. అణువణువునా సౌందర్యాన్ని కూరి ఆరడుగుల ఎతైన నక్షత్రాకారపు పీఠంపై చెక్కిన ఆలయాన్ని అలా చూసి వచ్చేస్తే సరిపోదు. కాస్తంత తీరిక చేసుకుని నింపాదిగా , ఓపిగ్గా, ప్రతి మూలను, ప్రతి కోణం నుంచి చూడాలి. ఒకదాని వెంట ఒకటిగా పరుగెత్తే ఏనుగుల వరస, నాగకన్య, అప్సరసల వయ్యారపు భంగిమలు, కాపలాదారులుగా ఉన్న వినాయకులు, ప్రత్యేకంగా ఒక మండపంలో సర్వాలంక్రుతుడై కొలువు తీరిన నందీశ్వరుడు... ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. శిలను మైనపు ముద్దను మలచినట్టుగా మలచి ఇలాంటి అపురూప కళాఖండాలను తీర్చి దిద్దిన శిల్పులకు నాయకత్వం వహించి ఒక సామ్రాజ్య చరిత్రను అజరామరం చేసిన రామప్ప పేరును గుడికి, గుడిలో ఉన్న లింగేశ్వరుడికి కూడా పెట్టడంలో అతిశయోక్తి లేదు.