పేజీలు

భావ వ్యక్తీకరణ (నా ప్రాథమిక హక్కు) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భావ వ్యక్తీకరణ (నా ప్రాథమిక హక్కు) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మార్చి 2011, శుక్రవారం

పదండి ముందుకు ...పదండి త్రోసుకు...

పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!దారి పొడుగునా విధ్వంసం సృష్టిస్తూ,మహనీయులను అవమానిస్తూ,సంస్కర్తలను చీత్కరిస్తూ,మేధావులపై దాడి చేస్తూ...పెళ పెళ పెళ పెళ విగ్రహాలు కూల్చుతూ...పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
శ్రీశ్రీ యెవ్వడు ? నాడు (1969)సమైఖ్య నినాదం ఇచ్చిన వాడు,శతాబ్ది కవి ఐతేనేమి! ఆతడు
తెలంగాణా ద్రోహి.
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
అన్న గురజాడ ఎవ్వడు?సంస్కర్త అయితే ఏంది గొప్ప?వాడు సీమాంద్రుడు.

చందమామ రావే
జాబిల్లి రావే యని
సంస్కృతికి గోరుముద్దలు తినిపించిన
సంకీర్తనాచార్యుడు,బ్రహ్మమొక్కటే ,పర బ్రహ్మమొక్కటే యని
నాడే సర్వమానవ సమానత్వాన్ని
ప్రభోదించిన వాడు, అయితేనేమి?వాడు సీమాంధ్ర దేవుడైన
తిరుమల రాయడిని కీర్తించిన వాడు
అన్నమయ్యను కూల్చాలె.పదండి ముందుకు,  పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
పేరులోనే రాయలని పెట్టుకుండు.
'
దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నడు గాని తెలంగాణ మాట్లాడిండా? లే !కూల్చండ్రి వాణ్ని. ఆది కవి నన్నయ్య , అయితే ఏంది?తెలుగు రాసిండు కాని తెలంగాణలో రాసిండా?గాడేందుకు మనకు కూల్చండ్రి.
ఏడకెళ్ళి వచ్చిండు, కాటన్
తన - పర, ప్రాంతీయ భేదాలు
ఎరుగని అపర భగీరధుడు.అయితేనేమి ఎరుగకుండానే
ఆంధ్రులకు మేలు (పాపం) చేసిన సీమాంద్రుడు.
గీడెవ్వడు! సిద్ధేంద్ర యోగంట...కూచిపూడి నేర్పిండ? చల్ తీయ్ !జాషువా అని దళిత రచయిత
పొలిటికల్ లీడరయితే లొల్లి సేస్తరు గాని ,రచయిత అయితే దళితుడైన గాని
అడిగే వారుండరు. ఇది ఆంద్ర గబ్బిలం.కూల్చండ్రి.ఈడేవ్వడో సి. ఆర్ . రెడ్డి
మీటింగ్ల మీదికి రాల్లేస్తే
'
రాజకీయాల్లో రాతియుగం ప్రవేశ పెడుతున్నారు'అని అన్నడు. మనది గాంధీ నాయకత్వమా ?లే ...! కేసీయార్ నాయకత్వం.అసెంబ్లీ లోనే 'కొట్టండి రా వాడ్ని' అని
జేపీని కొట్టించిన కేటీయార్ నాయకత్వం మనది.ఇదేమన్న దండి మార్చా ? కాదు! మిలియన్ మార్చ్ !పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
త్రిపురనేని రామస్వామి చౌదరి
పేరులోని చౌదరిని తీసేసుకున్న వాడు,'
'
విల విల యేడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండ...జీవ రహితంబగు బొమ్మకు (దేవుడికి) ఇండ్లు వాకిండ్లు,పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల ...' అని
మనుషులకు తప్ప రాతి బొమ్మకు నాడే
విలువనియ్యని హేతువాది, వీనికేందుకు విగ్రహం?కూల్చండ్రి. బ్రహ్మ నాయుడు వీడు, నేడు
ప్రతి అవకాశ వాది చేసే సహపంక్తి భోజనం నాడే చేసిన
సమభావ వాది . అయితేనేమి పల్నాటి వాడు
కూల్చండ్రి వాణ్ని.పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
మిలియన్ మార్చ్ పుణ్యమా అని పై మహానీయులందరినీ మరోసారి స్మరించుకునే సందర్భం ఎదురయ్యింది. కోదండరామ్ నాయకత్వానికి జేజేలు.


18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

పరిపక్వత చెందని ఉద్యమం

అసెంబ్లీ అన్నాక ప్రజా సమస్యల్ని విస్మరించి ఒకరిని ఒకరు తిట్టుకోడం, పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోడం, అడపా దడపా మైకులు, బల్లలు విరుచుకోడం... టీచర్ లేని క్లాసులో పిల్లల మాదిరిగా భాద్యతారాహిత్యంగా ప్రజాప్రతినిధులు ప్రవర్తించడం మనకు తెలియని విషయం ఏమీ కాదు. అయితే నిన్న అసెంబ్లీలో ఒక ఉద్యమానికి నాయకత్వం వహించే వాళ్ళు ఇంత కుసంస్కారంతో వ్యవహరించడం మాత్రం వింతే. 'మేమొచ్చి మీకు సంస్కారం నేర్పాము' అని ఆంధ్రా వాళ్ళు అన్న మాట నిజమేనేమో అనిపించేలా, మేము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు, మీరూ అంతే అని చెప్పండి, లేదంటే కొడతాం అని మూర్ఖంగా , అవతలి వ్యక్తికి తన భావాలను వెల్లడించే అధికారం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు తెలంగాణా నేతలు. మాట్లాడితే నాలుగు కోట్ల మంది మనోభావాలు అంటూ మాట్లాడే నేతలు నిన్న వీరి ప్రవర్తనకు ఈ నాలుగు కోట్ల మందిలో ఎంత మంది వీరిని అసహ్యించుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది తెలుసుకోకుండా, జరిగినదానికి కించిత్ పశ్చాతాపాన్ని కూడా వ్యక్తం చేయకుండా, ఇకపై మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే గతి అని హెచ్చరించడం చూస్తుంటే అసలు ఉద్యమాలకు నాయకత్వం వహించే పరిపక్వత వీరికి ఇంకా రాలేదనిపిస్తుంది. వీరి మాటల్ని నమ్మి ఉద్యమంలో సమిదలవుతున్న వారి కుటుంబాలు ఏమవుతాయో అన్న దిగులు కలుగుతుంది. ఉద్యమంపై సానుభూతిని, సహకారాన్ని పొందాలంటే ఎలా ముందుకు పోవాలన్నది వీరికి ఎవరైనా నేర్పి తెలంగాణను రక్షించండి. ఉద్యమాన్ని బ్రతికించండి.

8, డిసెంబర్ 2010, బుధవారం

డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు

'డబ్బు టు పవర్ ఆఫ్ డబ్బు ' అని యండమూరి వీరేంద్రనాథ్ నవల దాదాపు తెలుగు వాళ్ళందరూ చదివే ఉంటారు. నవలనే 'చాలెంజ్' అనే సినిమాగా తీసారు. నవల చదవని వారు కూడా సినిమాను చూసుంటారు. ఎందుకంటేచిరంజీవి సినిమాల్లో అదొక సూపర్ హిట్ సినిమా. అందులో హీరో ద్వారా చట్టబద్దంగా డబ్బు సంపాదించడం ఎలాగోచెప్పారు యండమూరి. తెలియకో లేక కథ పరిమితుల మేరకో కొన్ని పద్ధతుల గురించే ఆయన అందులో ప్రస్తావించారు. కాని ఈరోజు దినపత్రికలు చదువుతుంటే మన రాజకీయ నాయకులకు 'చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం ఎలా?' అన్నదాని గురించి తెలిసినన్ని పద్ధతులు మహా మహా రచయితల ఊహలకు కూడా అందవంటే నమ్మి తీరాల్సిందే.

కోట్ల కొద్ది ప్రజాధనం పంచుకుంటుంటే చూస్తూ ఊరుకోడం తప్ప మనం ఎం చేయలేం. ఎందుకంటే అన్నీ చట్టబద్దంగాజరిగే దోపిడీలే. కేసు పెట్టడానికి వీల్లేని కేసులు. అవసరమైతే చట్టాలను కూడా మార్చుకుని మరీ చట్టబద్ధంచేసుకుంటున్న దోపిడీ అది. అందుకే నువ్విన్ని కోట్లు మింగావు అంటే , నువ్విన్ని మింగావు అని ఏకంగా అసెంబ్లీ లోనేకొట్టుకు సచ్చినా ఒక్క కోర్టు కూడా దానిని సుమోటోగా తీసుకోలేక పోయింది. ఒక్క పోలీసు స్టేషన్లో కూడా ప్రజా వాజ్యంనమోదు కాలేదు. అంత దాకా ఎందుకు సాక్షి పత్రిక చట్టబద్ధమైన స్తాపన గురించి పత్రికలన్నీ కథనాలను గుప్పించినానోరెల్లి పెట్టి చదివామే కాని ఎదురు ప్రశ్నించామా? చట్ట బద్దం మరి.

తాజాగా రాజా గారి మీద కేసులు పెట్టమని , నిర్వాకాల మీదా దర్యాప్తులు చేపట్టమని ప్రతిపక్షాల గోల. వాళ్ళకి తెలుసుకేసులు పెట్టినా ఒరిగేది ఏదీ ఉండదని. లాలూ, జయలలిత, మాయావతి, ఇత్యాది రాజకీయ నాయకుల మీద పెట్టినకేసులన్నిటిలోనూ జరిగిందేమిటి? అందరూ నిరపరాధులే. ఎటొచ్చీ ప్రజలే అపరాధులు. ఒక్క నాయకుడి నుంచి కూడామ్రింగిన కోట్లను కక్కించలేని దుర్భలురు.

20, జులై 2010, మంగళవారం

బాబ్లీ సమస్య ఎవరిది?

బాబ్లీ విషయంలో బాబుది ఓవర్ యాక్షన్ అని రాజకీయ వ్యాఖ్యలు. ఉప ఎన్నికల దృష్ట్యా లాభ పడేందుకే ఈ రభస అని విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే అసలు ఈ సమస్య తెలంగాణా రైతులది అన్న విషయం అన్ని పార్టీలు , వార్త చానెళ్ళు, మేధావులు మర్చిపోయినట్టున్నారు.
తెలంగాణా తన సొత్తు అని భావించే కేసీఆర్ బాబ్లీ గురించి పట్టించుకోకపోవడం విడ్డూరం. రాజకీయం కోసమే తెలంగాణా వాదం తప్ప ప్రజల మేలు కోసం కాదన్నది ఆ పార్టీ పాలసీ ఏమో!
ఇక మా పార్టీ హయాంలో తెలంగాణా ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణా ప్రజలు మమ్మల్నే గెలిపించాలి అని పిలుపు నిచ్చే కాంగ్రెస్స్, బాబ్లీ గురించి ఎనాడైన పట్టించుకుని ఉంటె సమస్య ఇంత దాక వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా చంద్రబాబుని ఆడిపోసుకోవడం తప్ప ఆ విషయం మాకు సంబంధించింది కానే కాదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఈ విషయంలో కేంద్రం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇది రెండు రాష్ట్రాల సమస్య అట. రాష్ట్రం నుంచి ముడుపులు కావాలి. రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణా విషయంలో వేలు పెట్టి లబ్ది పొందాలి. కాని బాబ్లి దగ్గరికి వచ్చే సరికి మీరు మీరూ చూసుకోండి అని తప్పించుకుంటారు. కారణం రెండు రాష్ట్రాల్లో ఉన్నది మన పార్టీనే మరి. అందుకే ఇలా మొహం చాటేయడం. అదే ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట వేరే పార్టీ అధికారంలో ఉంటె ఇలాగే మాట్లాడే వారా? పెద్ద రగడ చేసేవారు కాదా? కేంద్ర రాజకీయం మరి!
ఇక కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేని స్థితిలోనే ఉంటుంది. బాబు గొడవతో చిరు చేసిన ఏడుకొండల పాద యాత్ర పబ్లిసిటీకి నోచుకోకుండా పోయింది. సమైక్య నినాదంతో తెలంగాణలో పోగొట్టుకున్న అభిమానాన్ని బాబ్లి విషయంలో చంద్ర బాబుకు మద్దతివ్వడం ద్వారా సంపాదిన్చుకున్దామా అంటే, ఈ మధ్యే కాంగ్రెస్స్ తో కొత్త దోస్తాన కలిసిన్దాయే. వారి మాటే వీరి మాట, వారి బాటయే వీరి బాటగా పరిస్థితి ఉంది. అందుకని వారేమి మాట్లాడే స్థితిలో లేరు.
ఇక వామపక్షాలు కూడా బాబ్లీ విషయంలో చురుకుగా ఏమీ లేరు. కారణం ఏంటో?
ఇలా పార్టీలన్నీ స్వలాభాలే చూసుకుంటుంటే అసలు సమస్య తీరేదెప్పుడు? ఎలాగూ ఏదో కారణంతో బాబు విషయాన్ని ఇంతదాకా లాక్కొచ్చాడు కాబట్టి , పైగా ఇది రాష్ట్ర రైతులందరి సమస్య కాబట్టి, పార్టీలన్నీ భేషజాలను , స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలి. ఇది పార్టీల సమస్య కాదు. ప్రజల సమస్య. రాష్ట్ర సమస్య. అంతకన్నా మించి ఇది మన ఐక్యతను , ఆత్మగౌరవాన్ని చాటే సందర్భం. మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా వాటిని పక్కన పెడదాం. నిజమైన ప్రజా సమస్య గురించి పోరాడదాం.
కొసమెరుపు: మన రాజకీయ నాయకులకు కటిక నేలపై , దోమల మద్య, సరైన సౌకర్యాలు లేని చోట నిద్రించడం అంటే ఏమిటో , ఇలాంటి జీవితాన్ని నిత్యం ఎంత మంది ప్రజలు ఎలా నెట్టుకు వస్తున్నారో అర్థం అయ్యే అవకాశం కలింగించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకందుకు అభినందించాల్సిందే. మహిళా నాయకులూ ! ఈ మాత్రం దానికే కంటినుండి నీళ్ళు వచ్చాయే మీకు. మీ నియోజక వర్గాల్లో ఎంత మంది మహిళలు ఇలాంటి ప్రత్యక్ష నరకంలో జీవిస్తున్నారో ఇకనైనా ఆరా తీసి, వారి కోసం ఏమైనా చెయ్యగలరా?

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఈ వ్యవస్థలో కులమూ ఒక ఆయుధమే !

అసలు కులం అన్న భావననే రూపుమాపాలని సభ్య సమాజం భావిస్తోంటే సిగ్గులేని, నీతిలేని రాజకీయాలు కులభావనని స్వార్థ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, వ్యభిచారం చేస్తూ కెమెరాలకు దొరికినా, అక్రమాలు చేసినా , ఆక్రమణలు చేసినా '. పలానా కులం వాడిని కాబట్టి నామీద కుట్ర చేస్తున్నారు. ఇది అగ్రవర్ణాల అహంకారం.' అని సిగ్గు లేకుండా తప్పును కప్పి పుచ్చుకునేందుకు, దృష్టినిమళ్ళించేందుకు కులాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. రిజర్వేషన్లు గాని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రాధాన్యత గానిఆయా కులాల్లో ఉన్న పేదలను ఉన్నత స్థితికి తీసుకురాడానికి ఉద్దేశించినవి. అంతే కాని కులపిచ్చిని రెచ్చగొట్టడానికికాదు. కులాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయడానికి కాదు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నూకారపు సూర్య ప్రకాశ రావు అనే ఆయనపై కొన్నేళ్ళ క్రితం భూ ఆక్రమణలఆరోపణలు వచ్చాయి. వాటినుంచి బయట పడేందుకు కుల ప్రస్తావన తెచ్చి హంగామా చేసాడు. ఆరోపణలలో నిజంఎంత ఉందో తెలీదు కాని , ఆయనకు మాత్రం ప్రెస్ కు ఎంత పవరు ఉందో బాగా అర్థమైంది . అందుకే ఒక పత్రిక పెట్టేసి తనేఇతరుల అక్రమాల గురించి రాయడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే , పత్రికను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగుకు పాల్పడ్డాడని. జర్నలిజం నైతిక విలువలని మంటకలిపాడని. ఆరోపణలని అతను న్యాయపరంగా ఎదుర్కోవచ్చు. తన చేతిలోనే పత్రిక ఉంది కాబట్టి అవన్నీ అభూత కల్పనలని సాక్షిపత్రిక తరహాలో వినూత్న కథనాలు రాసుకోవచ్చు. పత్రికలూ కూడా స్వప్రయోజనాలకే అన్న విషయం జనానికి ఎప్పుడోతెలిసింది. ఎవరు ఏం రాసుకున్నా వాళ్ళు అడగరు. ఇవన్నీ కాకుండా కుల ప్రస్తావన ఎందుకు స్వామీ? నీతి అన్నదిమనిషిని బట్టి ఉంటుంది కాని కులాన్ని బట్టి కాదని పత్రికాధిపతులు తమకు తెలియదా? రాధా కృష్నది అహంకారమేఅనుకుందాం. అతనూ పత్రికను అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించాడనే అనుకుందాం. నువ్వు చేసింది అక్రమం అంటేఏం నువ్వు చెయ్యలేదా' అని అసెంబ్లీలోనే కాట్లాడు కున్న వ్యవస్థ మనది. న్యూస్ ఛానెలు పెట్టి ఒకడు, పత్రిక పెట్టి ఒకడు,పార్టీ పెట్టి ఒకడు, ఆశ్రమం పెట్టి ఒకడు ..ఇలా అందరూ అక్రమంగా సంపాదించుకోండి. మనది ప్రజాస్వామ్యం మరి. అందుకని మేమేమీ అడగం. కానీ కులాల వాదం తీసుకురాకండి. దండం పెడతాం.
'

5, జనవరి 2010, మంగళవారం

పరోక్ష హింస మొదలయ్యింది !

ఈరోజు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాసిన తెలంగాణా రచయితల వేదిక వారికి,

'విభజనతో సమైఖ్య భావన' అని రాసిన వరవరరావు గారికి ,

ఇతర తెలంగాణా వాదులకు,

అయ్యా,

ఈ క్రింద ఉదహరించిన సంఘటనలకు ఎవరు సమాధానం చెప్తారు?

కొబ్బరిబోండాం దుకాణం..

అమ్ముతున్నది ఒక ఆడ మనిషి . ఒకతను వచ్చి ఎంత అన్నాడు? ఒకటి పది రూపాయలు అంది. వాళ్ళ సంభాషణలని బట్టి ఆమె ఆంధ్ర , అతను తెలంగాణా అని తెల్సింది. ఒక బొండాం అక్కడే తాగేసి మరొకటి పార్సెల్ తీసుకున్నాడు. పదిహేను రూపాయలు ఇచ్ఛి వెళ్ళబోయాడు.

'అదేంటి ఇంకా ఐదు రూపాయలియ్యి. ' అంది.

'మల్లచ్చినప్పుడు ఇస్తాలే' అని పోతానే ఉన్నాడు.

'ఆగు! అదేం కుదరదు. డబ్బులియ్యి .'

'ఏయ్ లేవ్ ఫో '

'అయితే కాయక్కడ ఎట్టు'అంది గట్టిగా .

'ఏయ్ ఏందీ సెప్పిన గంద . ఏడికి పోత?'

'నువ్వెవరో నాకు తెలీదు ముందు కాయ అక్కడ పెట్టు.'

'ఏయ్ నేనేవరనుకున్నావ్ . దుకాణం లేపెస్తా'

'ఆ ఆ చూసంలె . దుకాణం ఎమన్నా ఊరికే ఇచ్చారా. బోలెడు డబ్బులిచ్చాం.' (ఆవిడ అన్నది కిరాయి గురించి కాదు. రాజధానిలో ఎక్కడ ఎవరు ఎం చేయాలన్నా వీధి రౌడి గార్లకు డబ్బులిచ్చి వారి అనుమతి తీసుకోవాలి.)

'ఏయ్ ఏందే నకరాలు సేస్తున్నావ్ . నీ తల్లి యాదికేల్లో బతకనికి అచ్చి

'ఇదిగో మాటలు తిన్నంగా రాణి. మాకు వతాయ్ మాటలు. డబ్బులెట్టి కాయ కోనుక్కోలేదు గాని మాటాడు తున్నాడు

'నోర్ముయ్ ఆంద్ర లం... పడేసి ...'

అమ్మా సంధ్యమ్మ తల్లి ! చేతికి గాజులేసుకు కూర్చోలేదు అని మోహన్ బాబు అన్న మాటకే తరిమి కొడతాం అన్నారు . ఈ మహిళకు జరిగింది అవమానం కాదా ? లేక ఆంద్ర మహిళకు ఆత్మగౌరవం లేదంటారా?

సనత్ నగర్లో ..ఒక చోట...

ఉన్నట్టుండి ఓనరు ఇంటి అద్దె వెయ్యి పెంచాడు. అన్యాయం కదా అంటే ' మా తెలంగాణాలో అట్లే ఉంటది. ఇష్టమైతే ఉండు లేకుంటే నీ ఆంధ్రాకు ఫో?' కర్కశంగా అన్నాడు.

మరోచోట తన ఇంట్లో అద్దెకు ఉన్న ఆంద్ర వాళ్ళని మాత్రమే ఖాళీ చేయించాడు ఇంటాయన.

మరో ఘటన !.....

మా ఆటో అతను చాలా మంచివాడు. ఇదివరకు ఎప్పుడూ అతను సంస్కార హీనంగా మాట్లాడలేదు.

మొన్నొక రోజు ...

నేను ఆటో ఎక్కింది మొదలు ఆంధ్రావాల్లను దోపిడిగాళ్ళని , మోసగాళ్ళని, తరిమి తరిమి కొట్టాలని ..చాలా ఆవేశంగా మాట్లాడాడు. అతనిలో అంత ఆవేశం గత సంవత్సర కాలంలో ఎప్పుడూ చూడలేదు. అనాల్సినవన్నీ అన్నాక నన్ను అడిగాడు. మీరు ఆంధ్రోల్లా? తెలంగాణా వోల్లా? అని.

నేనేం సమాధానం చెప్పాలి? ఏ లెక్కలు ఉన్నాయి దీనికి? ముల్కి నిబంధనలా ? జే ఏ సి వాళ్ళేమైనా ప్రమాణాలు డిసైడ్ చేశారా ? నా తల్లిది తెలంగాణ . నా తండ్రిది ఉత్తరాంధ్ర . నేను పుట్టింది హైదరాబాదులో . పెరిగింది విజయవాడ. స్థిరపడింది మళ్ళీ ఇక్కడ. రాష్ట్రమంతా నాదే అనుకుని తిరిగాను. ఆ మాటకొస్తే దేశం, ఈ భూ ప్రపంచమే నాది. నన్ను ఆపే హక్కు ఎవరికుంది? ఏ తెలంగాణ వాళ్ళు విదేశాల్లో బతకడం లేదా? అలాగే నేను. ఆంద్ర వాళ్ళు.

ఎవడు ఎవడిని దోచుకున్నాడు? నీలో పోటీ పడే తత్త్వం లేక , బాగుపదాలన్న తపన లేక వెనుక పడితే అది ఎవడి తప్పు? నిన్ను చదువుకోకుండా ఎవరు ఆపారు? ఉద్యోగం చెయ్యకున్ద ఎవరు అడ్డుకున్నారు? నీ ప్రాంతం వెనుక బాటుకు నీ ప్రాంతం నుండి నీచే ఎన్నిక కాబడి యాభై ఏళ్లుగా నీ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించిన నీ ఎమ్మేల్లెలని నిలదీయి. నీ ప్రాంతం , నువ్వు వెనుకబడి ఉండగా వాళ్ళంతా కోట్లు ఎలా సంపాదించారో అడుగు. వాళ్లకు అడ్డు రాణి ఆంధ్రా వోడు నీ ఎదుగుదలకు ఎలా అడ్డయ్యాడు? అడుగు? కొడుకులను నిలదీయి? చిచ్చు పెట్టిండ్రు తమ్మీ. నీకూ నీ వాళ్ళకు మద్య చిచ్చు పెదతన్నారు.

అంత దాక ఎందుకు? మాటాడితే తెలంగాణా కావాలె అనేతోల్లంతా తెలంగాణా ఇస్తే ఏరకంగా అభివృద్ది చేస్తారో ప్రణాలికలతో ఉన్నారా?

అయ్యా !...దొరా ... హైదరాబాదులో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం పరోక్ష హింసకు గురౌతోంది . అందుకే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. అప్పుడే రెండు వర్గాలకు గౌరవం.

25, డిసెంబర్ 2009, శుక్రవారం

మీడియాకు ఇది పండుగ సీజన్!

గత కొన్నాళ్లుగా మీడియా వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఏమీ లేదే అనుకునేలోపు వై .యస్. ఆకస్మిక మరణం. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటు చుట్టూ తిరిగాయి కెమెరాలు . ఇంతలో జనాన్ని ముంచిన వరదలు మీడియాకు మాత్రం వరాలే ఇచ్చాయి. మన టీవీ-9 ఛానల్ బాగా ముందుకెళ్ళి 'కదలిరండి మనుషులయితే' అంటూ రోడ్డు మీదికి వచ్చి మరీ సమాజాన్ని కదిలించే ప్రయత్నం చేసింది. వరదలు అయిపోయాయో లేదో గనులు కంపించాయి. ఇక ఇప్పుడు తెలంగాణా ఉద్యమం చానెళ్ళ కరువు తీర్చడమే కాదు ఏకంగా గోదాములే నింపి పండుగ చేసుకోమ్మంటోంది.

కొన్నాళ్ళ క్రితం తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ 'నా కొడుకు తగలబడి పోతుంటే మీడియా వాళ్ళు ఒక వేడుకను చిత్రీకరించడానికన్నట్లు కెమెరాలు గురిపెట్టారు కానీ ఒక్కరు కూడా రక్షించడానికి ముందుకు రాలేదు ' అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది అతని తల్లి. అక్కడ మానవత్వాన్ని మరచి మరీ విధినిర్వహణ చేసింది మీడియా. ఆ కర్తవ్యపాలన ఫలితంగా మర్నాడు ఫుల్ పేజీలలో కనపడిన దృశ్యాలను చూసి అనేక హృదయాలు భగ్గుమన్నాయి. ఆ భగభగలను మళ్ళీ కవర్ చేసి వేడి వార్తలను మిర్చి బజ్జీల్లా అమ్మాయి , సారీ! రేపటి మెరుగైన సమాజం కోసం పంచాయి.మీడియా ఏది చేసినా రేపటి సమాజం కోసమే తప్ప ఈనాటి సమాజం కోసం కాదన్నది మనం గ్రహించాలి.

చిన్నప్పుడు భూతద్దం అంటే భూతాల్ని చూపెడుతుందేమో అని అనుకునేవాడిని. మన వార్తా చానెళ్ళు అలాంటి భూతద్ధాలే . ఇవి వచ్చాక అనేక విషయ భూతాల్ని , బోనస్ గా బూతుని కూడా పిల్లా పాపలతో కలిసి చూసే భాగ్యం మనకు కలిగింది. రోజూ ఊళ్ళో మా వాళ్ళ దగ్గరనుంచి ఫోన్లు వస్తున్నాయి. హైదరాబాద్ తగలబడి పోతుందని , ఇక్కడ ఆంధ్రోల్లని తరిమి కొడుతున్నారని వాళ్ళ టీవి భూతం చెప్పిందంట. ఎ క్షణం ఏమవుతుందో అని వాళ్ళు భయపడుతున్నారు.

విషయాన్ని గోరంతలు కొండంతలు చేయడం వరకు పర్వాలేదు. తెలంగాణా రాకపోతే నువ్వేం చేస్తావు ? సమైక్య ఆంధ్ర ప్రకటించక పొతే నువ్వేం చేస్తావు? అని ప్రశ్నిస్తుంటే 'ఏదో ఒకటి చేయి లేకపోతే కనీసం చేస్తానని చెప్పు చాలు , నిప్పు మేము రాజేస్తం , లేకపోతే మాకు రేటింగ్స్ ఎలా వస్తాయి?' అని గద్దించి అడుగుతున్నట్లు ఉంటుంది. ప్రతి ఒక్కడిని స్టూడియోకి పిలిచేసి వాడిని స్పాట్లో రెచ్చ గొట్టేసి ఏదో ఒకటి మాట్లాడించడం దాన్ని ఆజ్యం లాగ వాడుకోవడం , ఆ వచ్చిన వాడు కూడా సమాజానికి తనే ఏకైక ప్రతినిధిని అని ఊహించేసుకొని ఒర్లడం, దాన్ని మళ్ళీ భూతద్దం పెద్దదిగా చూపడం...ఇదంతా చూసి జనం భయాలకు లేదా విద్వేషాలకు గురికావడం ... అసలు ఒకప్పుడు చచ్చు , పుచ్చు మానవ సంబంధాల సీరియల్లతోనే మనం ఏమయిపోతమో అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చానెళ్ళ కన్నా ఎక్కువైపోయిన పార్టీ నగారాలు ఐ మీన్ వార్తా చానల్లు మరీ ప్రమాదకరంగా మారాయి. అయ్యా! ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అది వార్తే అవుతుంది. అది చాలు. సీరియల్సు క్రియేట్ చేసి వార్తలుగా అందించకండి . ఎందుకంటే నా బోటి సామాన్యులు అవి వార్తలు అని పొరబడే ప్రమాదం ఉంది. ప్లీజ్ ! రేపటి మెరుగయిన సమాజం కోసం.

23, డిసెంబర్ 2009, బుధవారం

చదవండి! చదివించండి!!

హైదరాబాదులోని నెక్లస్ రోడ్లో ఇరవై నాల్గవ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. మొన్న ఆదివారం భార్యాపిల్లలతో వెళ్ళాను. ప్రతిసంవత్సరం తప్పనిసరిగా వెళ్తాం మేము.
బుక్ ఫెయిర్ అనగానే మా పెద్దాడు ఎగిరి గంతేశాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఐదవ తరగతి చదివే మా వాడికి అసలు పుస్తకాలు చదివే అలవాటు లేదు. గతంలో ఎన్నో సార్లు వాడిని ఇలాంటి ప్రదర్శనలకు తీసుకువెళ్ళి మంచి మంచి పుస్తకాలు కొనేవాడిని. ఇంటికి తెచ్చాక వాటిని ఓ మూలన పడేసేవాడు. అసలు పుస్తకం కొనాలన్నఆలోచనగాని , చదవాలన్న ఆసక్తిగాని వాడికి ఉండేది కాదు. అందుకు కారణం టీవి అన్న విషయం వేరే చెప్పక్కర లేదు. వాడికి చదవటం అన్న అలవాటును ఎలా కలిగించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అలాంటిది ఈరోజు బుక్ ఫెయిర్ అనగానే సంతోషంగా మాతో రావడం నాకూ సంతోషం అనిపించింది. అక్కడికి వెళ్ళాక తనే కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకుని కొనుక్కున్నాడు. వాటిల్లో క్విజ్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వీడిని చూసి చిన్నోడు కూడా పుస్తకం కావాలని మారాం చేసాడు. మూడేళ్ళ మా చిన్నోడికి అక్షరమాల పుస్తకాలు కొనిచ్చాం . వాడు అక్కడే ఒక కుర్చీలో కూర్చుని ఆ పుస్తకాలను తిరగేస్తుంటే రెండు మూడు కెమెరాలు , బహుశా టీవి చానెళ్ళ వారివి అయివుంటాయి, వాడిని చుట్టుముట్టి కవర్ చేసాయి. మొత్తం మీద మా పెద్దాడు పుస్తకం కోనేంత వరకు రావడం నాకు ఆనందాన్నిచ్చింది. ఇక చదవడం అంటారా! అది కూడా నెమ్మదిగా అలవాటవుతుంది .

ఈ మాత్రం దానికి అంత సంతోష పడిపోవాలా? అని అనుకునే వారు ఉండొచ్చు. మనం వేలకు వేలు తగలేసి స్కూళ్ళల్లో చేరుస్తాం. పరీక్షలకు ముందు శెలవులు పెట్టి మరీ వాళ్ళ వెంటపడి బట్టీ పట్టిస్తం. మార్కులు చూసుకుని మురిసి పోతాం. కాని పెద్దయ్యాక వాడు వ్యక్తిత్వం లేని వాడుగా, తనకెదురైన సమస్యలను పరిష్కరించుకోలేని అసమర్దుడిగా, సమర్థత ఉండీ నిరూపించుకోలేని స్థితిలో , కౌన్సేల్లింగ్ క్లాసులకు వెళ్తుంటాడు. ప్రత్యేక వాదం , మతవాదం , మూఢ నమ్మకం ... ఇలాంటి ఉన్మాదాల ప్రభావాలకి లోనై ఆందోళనలు చేస్తుంటాడు. ఎవడో వస్తే , ఏదో తెస్తే తనకు మంచి జరుగుతుందని నమ్ముతుంటాడు.

ఇలాంటి దౌర్బల్యాలకు మనిషిని దూరం చేసి తన మీద తనకు నమ్మకాన్ని పెంచేది పుస్తక జ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివితే అంత వికసిస్తుంది మనసు. అందుకని చదవండి! చదివించండి!! ముందు పుస్తక ప్రదర్శనలకి రండి!

18, డిసెంబర్ 2009, శుక్రవారం

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ...

తెలంగాణా ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం తెచ్చే సంగతి తరువాత, ఇప్పటికి మాత్రం దాని మూలంగా ప్రజారాజ్యం పార్టీ పెద్ద ఇరకాటంలో పడింది. అసలే ప్రజాభిమానాన్ని ఓట్లుగా మలచుకోలేక ఎన్నికల విజయాలకు దూరమవుతోన్న ఆ పార్టీ, వలసలను ఆపలేక అవస్థలు పడుతోన్న ఆ పార్టీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీని నడపడం ఎలా అని కింద మీద అవుతున్న పార్టీ ఇప్పుడు రెండు ప్రాంతాల గొడవల మూలంగా అడకత్తెరలో పోకచెక్క అయ్యింది. కరవమంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపం అన్నట్టు ఉన్న పరిస్థితుల్లో నువ్వెటు అని అడిగేసరికి నారీ నారీ నడుమ మురారి అయ్యారు చిరంజీవి. రాజకీయ అనుభవం లేనందువల్ల రెండునాల్కల ధోరణి అవలంబించలేక భోలాశంకరుడు బోల్తా పడ్డాడు. ఫలితంగా పార్టీ తెలంగాణా ప్రజల విశ్వసనీయతను కోల్పోయి వారి ఆగ్రహానికి గురయ్యింది. అటు కలకలానికి కారణమైన కాంగ్రెస్ బాగానే ఉంది. ముందు మద్దతు ఇస్తామని, ఆ తర్వాత మాట మార్చిన తెలుగుదేశం బాగానే ఉంది. లోక్సత్తా , వామపక్షాలతో సహా చిన్న పార్టీలన్నీ బాగానే ఉన్నాయి. లేనిపోని కష్టాలన్నీ ప్రజారాజ్యానికే వచ్చాయి. నిజానికి గతంలో తెలంగాణాకు అనుకూలం అని చెప్పినప్పటికీ క్రిందటి సార్వత్రిక ఎన్నికలలో గాని, నిన్నటి గ్రేటర్ ఎన్నికలలో గాని తెలంగాణా ప్రజలు ఆ పార్టీకి మెజారిటీని ఇవ్వలేదు. అలాంటప్పుడు తెలంగాణా ఫై చిరంజీవిని మీ దారి ఎటు అని అడిగే నైతిక హక్కు వారికి లేదు. ఒకవేళ అడిగినా చిరంజీవి వైఖరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పే అయినా అది పార్టీకి సంబంధించిన విషయం . మధ్యలో సినిమాలు ఏం చేసాయి? ఉద్యమం పట్ల అవగాహన లేక పోవడం అంటే ఇదే. కనీసం ఒక్క టీఆరెస్ నాయకుడైనా సినిమాల జోలికి పోవద్దని తమ వాళ్లకు చెప్పాడా? ఏది ఏమైనా ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు తెలంగాణా దెబ్బ ప్రజారాజ్యానికి తగిలింది.

17, డిసెంబర్ 2009, గురువారం

కలసి ఉంటే కలదు సుఖం

తెలుగు నేల ఎవడయ్య జాగీరు పంచమని అడిగేటందుకు? తల్లి గుండెను చీల్చి రొమ్ములు పంచుకుంటే వస్తయా పాలు? తెలంగాణా కోసం సచ్చిన తమ్ముళ్ళకు కేసిఆర్ తన ఆస్తిని పంచుతడ అడుగు? దోచుకోనేడిది గీ దొరలే తమ్మి, ఆంధ్రోడు కాదు. కొడుకులు దారి తప్పిస్తండ్రు జర పయిలం తమ్మి . మోసపోకు ఆళ్ళ మాటలు నమ్మి. కలసి ఉంటేనే కలదు సుఖం తమ్మి. ఆస్తులున్నోల్ల లొల్లి గీ తెలంగాణా ఉద్యమం. కష్టపడి బతికేటందుకు ప్రత్యేక రాష్ట్రము ఎందుకు తమ్మి, గింత పెద్ద లోకమే ఉన్నది. యాస వేరయినా మన భాష , భావం, బాధ ఒక్కటే తమ్మి.

4, మే 2009, సోమవారం

మాతృ దేవో భవ:

pranalanu aricheta pattukuni, thana aaro pranameina biddanu chankana ethukuni parugeduthundaame. e khanamlo nethina bambu paduthundo teleedu. e khanana e bullettu gundenu cheelchutundo teleedu. ala parugeduthoone samudra teeramlo unna padavalloki cherukunnaru aame, aametho saha marikondaru. padavalu saagara jalalloki saagayi. ekkadiko aa payanam teleedu. ennallo aa payanam asalu teleedu. pranalnu kapadukovalanna pichchi aasha tappa, anduku kavalisina aaharam kani, neellu kani valla daggara levu. aakaasamlo sooreedu nippulu kuripisthunnadu, dayalekunda. gonthendipothondi. daham..daham.. chuttoo neelle. daham theerchaleni neellu. thoduga aakali. gantalu gdusthunnayi. biddadiki enda thaguluthondi. aakaliki edusthunnadu. paalichindi aame. aakali vesi bidda edchinappudalla paalisthoone undame. gantalu gadichayi. rojulu maaruthunnayi. theeram kanaraaledu. anthuleni prayanam. e prasthananiki ee payanam?
ontlo shaktinatha kariginchee .. paalisthoone undi. thana akali dappula kanna bidda mukyam. anduku thana pranaaloo nilavadam mukyam. emcheyyalo teleeni pichi talli, pichi premato chutto unna uppu neellanu tagindi. aakaliki nakanakalaaduthunna kadupu okkasaariga thiragabadindi. vaanthulu... ayinaa thappadu. pilladikosam edo okati tinali. tinadaniki emi levu kabatti thagaali. thaaguthoone undi. paalisthoone undi. pranaalu chikkipothunnayi. ayinaa ontloni raktapu chukkalni pogesi palachukkalugaa biddaki andisthoone undi. emi cheyaleni nissahaya sthithilo bartha. padavallo unnavaaru tindileka, daaham teeraka okkokkarugaa pranalu vadulthunnaru. mrithadehaala buruvekkuthundatamtho vaatini thama chethulatone samudramloki nissahayanga thosesthunnaru. edchina kanneellu raani paristhithi.
aameku thana paristhithi ardhamiendi. aakharu kshanalavi. thana biddadidiki chivarisariga palichindi. asalu paalu vachchaaya annadi noruleni aa pilladiki, dayamaalina aa devudike theliyaali. kani aa thalli kallalo thrupthi. bharthanu pilichindi. thanu saswathangaa selavu theesukuntunna sangathi cheppindi. moogaga rodinchaadu athanu. anthakanna emcheyyagaladu. kannu moosthoo chivari korika korindi. devudini kadu. vaadunnadanna nammkam eppudo poyindi. bharthane adigindi. thana biddanu elagaina brathikinchamani.bathikite elotu raakundaa penchamani. adi neravere daari kanapadakapoyina, aame thruptikosam thaloopaadu. thana sthanyaanni biddaku andhisthoone kallumoosindame. aa bidda thana thalli andhinchina premanu aakharusariga paalachukkala roopamlo andukunnadu.
biddanu odiloki teesukunna bhartha, jeevithantham nee cheyi viduvanani pramanam chesina bhartha aame mritha dehanni samudramloki thosesadu. payanam saaguthoone undi. chachina savalanu vadilinchukuntu. sagam chachina savalanu mosukuntoo pdavalu saagutoone unnayi.
Prabhkaran kosam Srilanka sainikulu saaginchina poru falitham idi. evvari baagu kosam ee poraatalu.? evari swecha kosam thirugubaatlu? prapanchama..manishini,premanu baligone yuddhalu manakenduku?