పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!దారి పొడుగునా విధ్వంసం సృష్టిస్తూ,మహనీయులను అవమానిస్తూ,సంస్కర్తలను చీత్కరిస్తూ,మేధావులపై దాడి చేస్తూ...పెళ పెళ పెళ పెళ విగ్రహాలు కూల్చుతూ...పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
శ్రీశ్రీ యెవ్వడు ? నాడు (1969)సమైఖ్య నినాదం ఇచ్చిన వాడు,శతాబ్ది కవి ఐతేనేమి! ఆతడు
తెలంగాణా ద్రోహి.
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
అన్న గురజాడ ఎవ్వడు?సంస్కర్త అయితే ఏంది గొప్ప?వాడు సీమాంద్రుడు.
చందమామ రావే
జాబిల్లి రావే యని
సంస్కృతికి గోరుముద్దలు తినిపించిన
సంకీర్తనాచార్యుడు,బ్రహ్మమొక్కటే ,పర బ్రహ్మమొక్కటే యని
నాడే సర్వమానవ సమానత్వాన్ని
ప్రభోదించిన వాడు, అయితేనేమి?వాడు సీమాంధ్ర దేవుడైన
తిరుమల రాయడిని కీర్తించిన వాడు
అన్నమయ్యను కూల్చాలె.పదండి ముందుకు, పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
పేరులోనే రాయలని పెట్టుకుండు.
'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నడు గాని తెలంగాణ మాట్లాడిండా? లే !కూల్చండ్రి వాణ్ని. ఆది కవి నన్నయ్య , అయితే ఏంది?తెలుగు రాసిండు కాని తెలంగాణలో రాసిండా?గాడేందుకు మనకు కూల్చండ్రి.
ఏడకెళ్ళి వచ్చిండు, కాటన్
తన - పర, ప్రాంతీయ భేదాలు
ఎరుగని అపర భగీరధుడు.అయితేనేమి ఎరుగకుండానే
ఆంధ్రులకు మేలు (పాపం) చేసిన సీమాంద్రుడు.
గీడెవ్వడు! సిద్ధేంద్ర యోగంట...కూచిపూడి నేర్పిండ? చల్ తీయ్ !జాషువా అని దళిత రచయిత
పొలిటికల్ లీడరయితే లొల్లి సేస్తరు గాని ,రచయిత అయితే దళితుడైన గాని
అడిగే వారుండరు. ఇది ఆంద్ర గబ్బిలం.కూల్చండ్రి.ఈడేవ్వడో సి. ఆర్ . రెడ్డి
మీటింగ్ల మీదికి రాల్లేస్తే
' రాజకీయాల్లో రాతియుగం ప్రవేశ పెడుతున్నారు'అని అన్నడు. మనది గాంధీ నాయకత్వమా ?లే ...! కేసీయార్ నాయకత్వం.అసెంబ్లీ లోనే 'కొట్టండి రా వాడ్ని' అని
జేపీని కొట్టించిన కేటీయార్ నాయకత్వం మనది.ఇదేమన్న దండి మార్చా ? కాదు! మిలియన్ మార్చ్ !పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
త్రిపురనేని రామస్వామి చౌదరి
పేరులోని చౌదరిని తీసేసుకున్న వాడు,'
'విల విల యేడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండ...జీవ రహితంబగు బొమ్మకు (దేవుడికి) ఇండ్లు వాకిండ్లు,పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల ...' అని
మనుషులకు తప్ప రాతి బొమ్మకు నాడే
విలువనియ్యని హేతువాది, వీనికేందుకు విగ్రహం?కూల్చండ్రి. బ్రహ్మ నాయుడు వీడు, నేడు
ప్రతి అవకాశ వాది చేసే సహపంక్తి భోజనం నాడే చేసిన
సమభావ వాది . అయితేనేమి పల్నాటి వాడు
కూల్చండ్రి వాణ్ని.పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
మిలియన్ మార్చ్ పుణ్యమా అని పై మహానీయులందరినీ మరోసారి స్మరించుకునే సందర్భం ఎదురయ్యింది. కోదండరామ్ నాయకత్వానికి జేజేలు.
శ్రీశ్రీ యెవ్వడు ? నాడు (1969)సమైఖ్య నినాదం ఇచ్చిన వాడు,శతాబ్ది కవి ఐతేనేమి! ఆతడు
తెలంగాణా ద్రోహి.
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
అన్న గురజాడ ఎవ్వడు?సంస్కర్త అయితే ఏంది గొప్ప?వాడు సీమాంద్రుడు.
చందమామ రావే
జాబిల్లి రావే యని
సంస్కృతికి గోరుముద్దలు తినిపించిన
సంకీర్తనాచార్యుడు,బ్రహ్మమొక్కటే ,పర బ్రహ్మమొక్కటే యని
నాడే సర్వమానవ సమానత్వాన్ని
ప్రభోదించిన వాడు, అయితేనేమి?వాడు సీమాంధ్ర దేవుడైన
తిరుమల రాయడిని కీర్తించిన వాడు
అన్నమయ్యను కూల్చాలె.పదండి ముందుకు, పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
పేరులోనే రాయలని పెట్టుకుండు.
'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నడు గాని తెలంగాణ మాట్లాడిండా? లే !కూల్చండ్రి వాణ్ని. ఆది కవి నన్నయ్య , అయితే ఏంది?తెలుగు రాసిండు కాని తెలంగాణలో రాసిండా?గాడేందుకు మనకు కూల్చండ్రి.
ఏడకెళ్ళి వచ్చిండు, కాటన్
తన - పర, ప్రాంతీయ భేదాలు
ఎరుగని అపర భగీరధుడు.అయితేనేమి ఎరుగకుండానే
ఆంధ్రులకు మేలు (పాపం) చేసిన సీమాంద్రుడు.
గీడెవ్వడు! సిద్ధేంద్ర యోగంట...కూచిపూడి నేర్పిండ? చల్ తీయ్ !జాషువా అని దళిత రచయిత
పొలిటికల్ లీడరయితే లొల్లి సేస్తరు గాని ,రచయిత అయితే దళితుడైన గాని
అడిగే వారుండరు. ఇది ఆంద్ర గబ్బిలం.కూల్చండ్రి.ఈడేవ్వడో సి. ఆర్ . రెడ్డి
మీటింగ్ల మీదికి రాల్లేస్తే
' రాజకీయాల్లో రాతియుగం ప్రవేశ పెడుతున్నారు'అని అన్నడు. మనది గాంధీ నాయకత్వమా ?లే ...! కేసీయార్ నాయకత్వం.అసెంబ్లీ లోనే 'కొట్టండి రా వాడ్ని' అని
జేపీని కొట్టించిన కేటీయార్ నాయకత్వం మనది.ఇదేమన్న దండి మార్చా ? కాదు! మిలియన్ మార్చ్ !పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
త్రిపురనేని రామస్వామి చౌదరి
పేరులోని చౌదరిని తీసేసుకున్న వాడు,'
'విల విల యేడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండ...జీవ రహితంబగు బొమ్మకు (దేవుడికి) ఇండ్లు వాకిండ్లు,పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల ...' అని
మనుషులకు తప్ప రాతి బొమ్మకు నాడే
విలువనియ్యని హేతువాది, వీనికేందుకు విగ్రహం?కూల్చండ్రి. బ్రహ్మ నాయుడు వీడు, నేడు
ప్రతి అవకాశ వాది చేసే సహపంక్తి భోజనం నాడే చేసిన
సమభావ వాది . అయితేనేమి పల్నాటి వాడు
కూల్చండ్రి వాణ్ని.పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
మిలియన్ మార్చ్ పుణ్యమా అని పై మహానీయులందరినీ మరోసారి స్మరించుకునే సందర్భం ఎదురయ్యింది. కోదండరామ్ నాయకత్వానికి జేజేలు.