
పేజీలు
31, డిసెంబర్ 2010, శుక్రవారం
18, డిసెంబర్ 2010, శనివారం
నాగవల్లి కాదు చంద్రముఖి రీమేక్! ఇష్టమైతే చూడొచ్చు.

ఒక సినిమాకు సీక్వెల్ అంటే మొదటిదాని కథ ఎక్కడ ముగిసిందో అక్కడ నుండి మొదలయ్యే మరో కథ. పాత్రలు అన్నీకాకపోయినా కొన్ని మాత్రం రెండో దానిలోనూ ఉండాలి. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి కథ సీక్వెల్కథలాగే ఉంది. ఎటొచ్చీ కథనం మాత్రం చంద్రముఖి సినిమాను ఆర్టిస్టులను మార్చి రీమేక్ చేసినట్టుగా ఉంది. అవే సీన్లు. డైలాగులు కూడా అవే. పాటల ప్లేస్మెంట్ కూడా మక్కీకి మక్కీ.
చంద్రముఖీ కి సీక్వెల్ అనగానే ఆ స్థాయి థ్రిల్ ఉంటుందని వస్తాడు ప్రేక్షకుడు. అంతే కాని అదే సినిమాని మళ్ళీచూడాలనుకోడు. ఇది దర్శకుడు వాసు ఎందుకు తెలుసుకోలేదో తెలీదు. పైగా ఇక్కడ జరిగింది ఏమిటంటే.. అవే సీన్లురిపీట్ అయ్యేసరికి ప్రేక్షకులు ఆర్టిస్టుల పర్ఫార్మేన్సును పోల్చి చూసుకున్నారు. దాంతో వీరంతా తేలిపోయారు. ముఖ్యంగా వెంకటేష్ , అనుష్క. వెంకటాపురం రాజాగా వెంకటేష్ నటన బాగానే ఉన్నా , ఆ పాత్రలో ఉండాల్సినంతక్రౌర్యాన్ని, చంద్రముఖి మీద అతనికున్న విపరీత వ్యామోహాన్నీ చూపించడంలో దర్శకత్వ లోపం కనబడింది. అదేపాత్రలో రజని చూపించిన హావభావాలు అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకు ప్రాణం. అలాగే క్లైమాక్స్ లో జ్యోతికరక్తి కట్టించినట్టుగా చేసేందుకు నాగవల్లిలో ఎవరి పెర్ఫార్మేన్సుకు అవకాశం లేకుండా పోయింది. అనుష్కాను మరింతగాఉపయోగించుకుంటే బాగుండేది.
అసలు అంతమంది హీరోయిన్లు అవసరమా అనిపించింది. శ్రద్ధాదాస్ , పూనంకౌర్ లు శుద్ధ వేస్ట్. కమలిని ముఖర్జీ ట్రాక్ ,కథను సాగతీయడానికి తప్ప ముఖ్య కథకు అతక లేదు. రిచా గంగోపాద్యాయ పరవాలేదనిపించింది. ఒక్క ముక్కలోచెప్పాలంటే అనుష్క, రిచాలతోనే కథను రంజింప చేయవచ్చు. పోనీ ఇంతమంది హీరోయిన్లు ఉన్నందువల్ల గ్లామర్కురిసిందా అంటే అదీ లేదు.
వెంకటేష్ గురించి వెళ్ళే వాళ్లకు ఈ సినిమా ఒకే . మూడు రకాల గెటప్ లలో విభిన్నంగా కనిపించాడు. సైకియాట్రిస్ట్ , వెంకటాపురం రాజా వారి పాత్రల్లో రజనీతో పోల్చుకోకుండా చూస్తే వెంకీ బాగానే చేసినట్టు. కాకపోతే ప్రతి సీన్లోను కామెడీకాకుండా అవసరమైన చోట్ల అయినా సరే కాస్త సీరియస్ నెస్ మెయింటేన్ చేయాల్సింది.
గ్రాఫిక్స్ బాగున్నాయి. ముఖ్యంగా పాము చాలా సహజంగా కనిపించి సన్నివేశాలను రక్తి కట్టించింది. మానసిక శాస్త్రంలోతీరని, బలమైన కోరికకు సంకేతం పాము. ఇక్కడ ఒక మానసిక సమస్య మొదలు అయ్యిందని చెప్పడానికిఉపయోగించుకున్నారు. హీరోయిన్ రిచా చేత పాత సినిమాలో మాదిరి ఒంటి చేత్తో మంచాన్ని లేపించాలని మంచం దగ్గరషాట్ కూడా తీశారు. అంతలో మనసు మార్చుకుని శాండ్లియర్ సీన్ తీసారు.
అసలు ఈ సినిమాకు నాగవల్లి అన్న టైటిల్ వేస్ట్. ఒకే ఒక డైలాగులో తప్పదన్నట్టు నాగవల్లి అని పిలిపించి టైటిల్ కున్యాయం చేశాం అనిపించారు. నిజానికి ఇది చంద్రముఖి - రెండు.
మొత్తం మీద కుంటుంబం మొత్తం ఏదో ఒక సినిమాకు వెళ్లి టైం పాస్ చేద్దాం అనుకుంటే నాగవల్లికి వెళ్ళొచ్చు. అయితేచంద్రముఖిని ఇంట్లోనే వదిలేసి వెళ్ళండి.
15, డిసెంబర్ 2010, బుధవారం
ఎందుకోసం ఈ 'ఫ్రాకులాట'?






డిల్లీలో తలదాచుకోడానికి ఇల్లు లేని దాదాపు లక్ష మంది అభాగ్యులు, కప్పుకోడానికి కనీసం ఓ గుడ్డ ముక్క కూడాదొరక్క చలికి అల్లాడుతూ రోడ్ల పక్కన నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని వార్త. అలాంటి అభాగ్యులు మనహైదరాబాదులోనూ చాలామంది ఉన్నారు.
అయితే ఈ ప్రక్క ఫోటోలలో ఉన్న అభాగ్యుల సంగతి వేరు. వారు వేసుకునే డ్రస్సు ఖరీదుతో పది మంది నిర్భాగ్యులకు రెండేసి రగ్గులు చొప్పున కొని ఇవ్వవచ్చు.. అయినా అదేం ఖర్మో కాని అంత పెట్టి కొన్న డ్రస్సు సగం శరీరాన్ని కప్పుకుండా చలి గాలికి వదిలేస్తోంది. కెమరా ఫ్లాషులకు సగం శరీరాన్ని అప్పగించేస్తుంది. ఈ ఫోటోలలో చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపల్ని చూస్తే విషయం మీకే అర్థం అవుతుంది. ఒక రకంగా ఇది వారికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఏమరుపాటున కూర్చునే భంగిమలో తేడా వస్తే కేమెర కళ్ళు ఫ్రేముల్లో పసిగట్టేస్తాయి. క్షణాల్లో లక్షలాది మందికి చేరవేస్తాయి. ఎంతైనా వాళ్ళూ ఆడవాళ్లేగా. ఓ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళేగా? సమాజాన్నిలెక్క చెయ్యరు సరే, కుటుంబ సభ్యుల సంగతేంటి? అయినా ఇంత రిస్కు వాళ్ళెందుకు చేస్తున్నట్టు? ఈ పాకులాట ఎందుకోసం? ఎవరిని ఆకర్షించడానికి? ఎలాంటి ఆఫర్లు సంపాదించడానికి? సినిమా ఆఫర్లు సంపాదించడానికి కావలిసింది ఏంటి? అందం, ప్రతిభ - ఇవి కాదా? ఈ ప్రదర్శనలు అవసరమా? సెన్సారు కళ్ళు కప్పి ఎలాగు సినిమాల్లో ఎక్స్ పోజ్ అవుతూనే ఉన్నారు. అయితే ఆ సినిమాలు సరిగా ఆడటం లేదు కాబట్టి, ఆడియో ఫంక్షన్లలో ,అవార్డు కార్యక్రమాల్లో, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ ఎక్స్ క్లూసివ్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
ఎవరు ఎలా పోతే మనకెందుకు? అయినా నెట్ జనులు చూసి ఆనందిస్తున్నారుగా, మద్యలో నీకేంటి? అంటారేమో! నిజమే కాని, సినిమా ఆఫర్ల గురించి ప్రయత్నించే, లేదా మరే ఆఫీసులోనో మంచి అవకాశాల గురించి ప్రయత్నించే ఆడపిల్లలకు, అవకాశం ఇచ్చేవారికి ఇది ఎ రకమైన సంకేతాలనిస్తుంది?
అందాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు. ఎందుకంటే సౌందర్యం అనేది మనకు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకత. కాని అంగాలు అందరికి ఉంటాయి. వాటికి ఎ ప్రత్యేకతా ఉండదు. కాబట్టి ఇటు ఆస్వాదించే వాళ్ళు, అటు ప్రదర్శించే వాళ్ళూ అసలైన సౌందర్యాన్ని గుర్తించాలి.
8, డిసెంబర్ 2010, బుధవారం
డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు
'డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ' అని యండమూరి వీరేంద్రనాథ్ నవల దాదాపు తెలుగు వాళ్ళందరూ చదివే ఉంటారు. ఆ నవలనే 'చాలెంజ్' అనే సినిమాగా తీసారు. నవల చదవని వారు కూడా సినిమాను చూసుంటారు. ఎందుకంటేచిరంజీవి సినిమాల్లో అదొక సూపర్ హిట్ సినిమా. అందులో హీరో ద్వారా చట్టబద్దంగా డబ్బు సంపాదించడం ఎలాగోచెప్పారు యండమూరి. తెలియకో లేక కథ పరిమితుల మేరకో కొన్ని పద్ధతుల గురించే ఆయన అందులో ప్రస్తావించారు. కాని ఈరోజు దినపత్రికలు చదువుతుంటే మన రాజకీయ నాయకులకు 'చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం ఎలా?' అన్నదాని గురించి తెలిసినన్ని పద్ధతులు మహా మహా రచయితల ఊహలకు కూడా అందవంటే నమ్మి తీరాల్సిందే.
కోట్ల కొద్ది ప్రజాధనం పంచుకుంటుంటే చూస్తూ ఊరుకోడం తప్ప మనం ఎం చేయలేం. ఎందుకంటే అన్నీ చట్టబద్దంగాజరిగే దోపిడీలే. కేసు పెట్టడానికి వీల్లేని కేసులు. అవసరమైతే చట్టాలను కూడా మార్చుకుని మరీ చట్టబద్ధంచేసుకుంటున్న దోపిడీ అది. అందుకే నువ్విన్ని కోట్లు మింగావు అంటే , నువ్విన్ని మింగావు అని ఏకంగా అసెంబ్లీ లోనేకొట్టుకు సచ్చినా ఒక్క కోర్టు కూడా దానిని సుమోటోగా తీసుకోలేక పోయింది. ఒక్క పోలీసు స్టేషన్లో కూడా ప్రజా వాజ్యంనమోదు కాలేదు. అంత దాకా ఎందుకు సాక్షి పత్రిక చట్టబద్ధమైన స్తాపన గురించి పత్రికలన్నీ కథనాలను గుప్పించినానోరెల్లి పెట్టి చదివామే కాని ఎదురు ప్రశ్నించామా? చట్ట బద్దం మరి.
తాజాగా రాజా గారి మీద కేసులు పెట్టమని , నిర్వాకాల మీదా దర్యాప్తులు చేపట్టమని ప్రతిపక్షాల గోల. వాళ్ళకి తెలుసుకేసులు పెట్టినా ఒరిగేది ఏదీ ఉండదని. లాలూ, జయలలిత, మాయావతి, ఇత్యాది రాజకీయ నాయకుల మీద పెట్టినకేసులన్నిటిలోనూ జరిగిందేమిటి? అందరూ నిరపరాధులే. ఎటొచ్చీ ప్రజలే అపరాధులు. ఒక్క నాయకుడి నుంచి కూడామ్రింగిన కోట్లను కక్కించలేని దుర్భలురు.
కోట్ల కొద్ది ప్రజాధనం పంచుకుంటుంటే చూస్తూ ఊరుకోడం తప్ప మనం ఎం చేయలేం. ఎందుకంటే అన్నీ చట్టబద్దంగాజరిగే దోపిడీలే. కేసు పెట్టడానికి వీల్లేని కేసులు. అవసరమైతే చట్టాలను కూడా మార్చుకుని మరీ చట్టబద్ధంచేసుకుంటున్న దోపిడీ అది. అందుకే నువ్విన్ని కోట్లు మింగావు అంటే , నువ్విన్ని మింగావు అని ఏకంగా అసెంబ్లీ లోనేకొట్టుకు సచ్చినా ఒక్క కోర్టు కూడా దానిని సుమోటోగా తీసుకోలేక పోయింది. ఒక్క పోలీసు స్టేషన్లో కూడా ప్రజా వాజ్యంనమోదు కాలేదు. అంత దాకా ఎందుకు సాక్షి పత్రిక చట్టబద్ధమైన స్తాపన గురించి పత్రికలన్నీ కథనాలను గుప్పించినానోరెల్లి పెట్టి చదివామే కాని ఎదురు ప్రశ్నించామా? చట్ట బద్దం మరి.
తాజాగా రాజా గారి మీద కేసులు పెట్టమని , నిర్వాకాల మీదా దర్యాప్తులు చేపట్టమని ప్రతిపక్షాల గోల. వాళ్ళకి తెలుసుకేసులు పెట్టినా ఒరిగేది ఏదీ ఉండదని. లాలూ, జయలలిత, మాయావతి, ఇత్యాది రాజకీయ నాయకుల మీద పెట్టినకేసులన్నిటిలోనూ జరిగిందేమిటి? అందరూ నిరపరాధులే. ఎటొచ్చీ ప్రజలే అపరాధులు. ఒక్క నాయకుడి నుంచి కూడామ్రింగిన కోట్లను కక్కించలేని దుర్భలురు.
6, డిసెంబర్ 2010, సోమవారం
25, నవంబర్ 2010, గురువారం
కూలి నెంబర్ వన్
అది హైదరాబాదు లోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక బడాబాబు ఇల్లు.
''ఆ అమ్మాయినే చేసుకుంటానంటే నీకు ఈ ఆస్తిలో నయాపైసా కూడా ఇవ్వను!'' గద్దించాడు బడాబాబు.
''మరేం పరవాలేదు! నాకు ప్రేమ దొరికితే చాలు. అదే తింటాను. అదే తాగుతాను. అదే పీలుస్తాను. '' నిన్నే గర్ల్ ఫ్రండుతోఐమాక్స్ థియేటర్ లో చూసిన యూత్ సినిమాలోని డైలాగును ఉద్వేగంగా చెప్పాడు దొరబాబు.
''ఒరేయ్! డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినోడివి. ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం చాతకానోడివి. డబ్బు లేకుండా ఎలాబ్రతుకుతావురా?" బెదిరించే ప్రయత్నం చేసాడు బడాబాబు.
"నన్నేం బెదిరించక్కర లేదు. కూలి పని చేసుకు బ్రతుకుత."
"పిచ్చోడా! కూలి పని చేస్తావా? హ్హ హ్హా ! "
"ఎందుకంత ఎగతాళి? కావాలంటే కూలిపని చేసి రేపు ఈపాటికి పది లక్షలతో ఇంటికి వస్తా. నేనేంటో నిరూపిస్తా !"
ఆవేశంగా బయటకు వెళ్ళాడు దొరబాబు. కూలీ అన్న మాట వినను కూడా వినని కొడుకు ఈ చాలెంజి ఎలాచేసాడబ్బా...అని బుర్ర గోక్కుంటున్న బడాబాబు దృష్టి టేబుల్ పైన ఉన్న వార్తా పత్రిక పైన పడింది. 'కూలి చేసిపద్నాలుగు లక్షలు సంపాదించిన కేసీఆర్ .' అన్న హెడ్డింగు చూసి నవ్వుకున్నాడు బడాబాబు.
*******
అదే హెడ్డింగు చూసి ఇంకొకడు కూడా నవ్వుకున్నాడు. వాడెవడో కాదు! తరతరాల నుంచీ కూలీ బతుకీడుస్తూ ఈనాటికికూడా పూట గడవని స్థితిలో ఉన్న నిజమైన కూలీ.
''ఆ అమ్మాయినే చేసుకుంటానంటే నీకు ఈ ఆస్తిలో నయాపైసా కూడా ఇవ్వను!'' గద్దించాడు బడాబాబు.
''మరేం పరవాలేదు! నాకు ప్రేమ దొరికితే చాలు. అదే తింటాను. అదే తాగుతాను. అదే పీలుస్తాను. '' నిన్నే గర్ల్ ఫ్రండుతోఐమాక్స్ థియేటర్ లో చూసిన యూత్ సినిమాలోని డైలాగును ఉద్వేగంగా చెప్పాడు దొరబాబు.
''ఒరేయ్! డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినోడివి. ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం చాతకానోడివి. డబ్బు లేకుండా ఎలాబ్రతుకుతావురా?" బెదిరించే ప్రయత్నం చేసాడు బడాబాబు.
"నన్నేం బెదిరించక్కర లేదు. కూలి పని చేసుకు బ్రతుకుత."
"పిచ్చోడా! కూలి పని చేస్తావా? హ్హ హ్హా ! "
"ఎందుకంత ఎగతాళి? కావాలంటే కూలిపని చేసి రేపు ఈపాటికి పది లక్షలతో ఇంటికి వస్తా. నేనేంటో నిరూపిస్తా !"
ఆవేశంగా బయటకు వెళ్ళాడు దొరబాబు. కూలీ అన్న మాట వినను కూడా వినని కొడుకు ఈ చాలెంజి ఎలాచేసాడబ్బా...అని బుర్ర గోక్కుంటున్న బడాబాబు దృష్టి టేబుల్ పైన ఉన్న వార్తా పత్రిక పైన పడింది. 'కూలి చేసిపద్నాలుగు లక్షలు సంపాదించిన కేసీఆర్ .' అన్న హెడ్డింగు చూసి నవ్వుకున్నాడు బడాబాబు.
*******
అదే హెడ్డింగు చూసి ఇంకొకడు కూడా నవ్వుకున్నాడు. వాడెవడో కాదు! తరతరాల నుంచీ కూలీ బతుకీడుస్తూ ఈనాటికికూడా పూట గడవని స్థితిలో ఉన్న నిజమైన కూలీ.
4, నవంబర్ 2010, గురువారం
దీపావళి శుభాకాంక్షలు !
కాలుష్య రహిత దీపావళిని , కల్మషం లేని మనసుతో , కల్తీ లేని ఆనందంతో కాంతి భరితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ... మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
కాలుష్య రహిత దీపావళి - మామూలు రోజుల్లోనే వాతావరణ కాలుష్యం ఎక్కువ. ఇక దీపావళికి అది రెండు వందల శాతం ఎక్కువ కలుషితం అవుతుందని అంచనా. అందుకని టపాసులను ఎక్కువగా కాల్చకండి. వాయు కాలుష్యాన్ని పెంచాకండి. ఇక మామూలుగా మన చెవులకు అరవై దేసిబుల్స్ స్థాయి శబ్దాలు మాత్రమే అనుకూలం. అంతకు మించి స్థాయి గల శబ్దాలు రక్త పోటును పెంచి గుండెపోటుకు కారణం అవుతాయి. అందుకని పెద్దగా శబ్దం చేయని టపాసులను కాల్చండి.
కల్మషం లేని మనసు - టపాసులు కాలుస్తా .....చాలామంది డబ్బులు కాలిపోతున్నాయి అని భాధ పడుతూ ఉంటారు. కాని తప్పదు. పిల్లలు ఊరుకోరు కదా. దానికి మించి పొరుగువాడు కాలుస్తుంటే మనం కాల్చకపోవడం అనేది శ్రీమతికి నామోషి. అందుకని డబ్బులు తగలెయ్యడం అంటే టపాసులను కాల్చడం తప్పట్లేదని అనుకుంటూ బాధపడుతుంటారు. కాని ఒక్కసారి మీ పిల్లల ముఖాల్లోకి చూడండి. ఆ ఆనదాన్ని ఎంత డబ్బు పెట్టి కొనగలరు? దానితో పోలిస్తే మీరు తపసులకు తగలేసేది తక్కువే. కాబట్టి సంతషంగా పండుగ చేసుకోండి.
దీపావళి శుభాకాంక్షలతో ...
కాలుష్య రహిత దీపావళి - మామూలు రోజుల్లోనే వాతావరణ కాలుష్యం ఎక్కువ. ఇక దీపావళికి అది రెండు వందల శాతం ఎక్కువ కలుషితం అవుతుందని అంచనా. అందుకని టపాసులను ఎక్కువగా కాల్చకండి. వాయు కాలుష్యాన్ని పెంచాకండి. ఇక మామూలుగా మన చెవులకు అరవై దేసిబుల్స్ స్థాయి శబ్దాలు మాత్రమే అనుకూలం. అంతకు మించి స్థాయి గల శబ్దాలు రక్త పోటును పెంచి గుండెపోటుకు కారణం అవుతాయి. అందుకని పెద్దగా శబ్దం చేయని టపాసులను కాల్చండి.
కల్మషం లేని మనసు - టపాసులు కాలుస్తా .....చాలామంది డబ్బులు కాలిపోతున్నాయి అని భాధ పడుతూ ఉంటారు. కాని తప్పదు. పిల్లలు ఊరుకోరు కదా. దానికి మించి పొరుగువాడు కాలుస్తుంటే మనం కాల్చకపోవడం అనేది శ్రీమతికి నామోషి. అందుకని డబ్బులు తగలెయ్యడం అంటే టపాసులను కాల్చడం తప్పట్లేదని అనుకుంటూ బాధపడుతుంటారు. కాని ఒక్కసారి మీ పిల్లల ముఖాల్లోకి చూడండి. ఆ ఆనదాన్ని ఎంత డబ్బు పెట్టి కొనగలరు? దానితో పోలిస్తే మీరు తపసులకు తగలేసేది తక్కువే. కాబట్టి సంతషంగా పండుగ చేసుకోండి.
దీపావళి శుభాకాంక్షలతో ...
20, జులై 2010, మంగళవారం
బాబ్లీ సమస్య ఎవరిది?
బాబ్లీ విషయంలో బాబుది ఓవర్ యాక్షన్ అని రాజకీయ వ్యాఖ్యలు. ఉప ఎన్నికల దృష్ట్యా లాభ పడేందుకే ఈ రభస అని విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే అసలు ఈ సమస్య తెలంగాణా రైతులది అన్న విషయం అన్ని పార్టీలు , వార్త చానెళ్ళు, మేధావులు మర్చిపోయినట్టున్నారు.
తెలంగాణా తన సొత్తు అని భావించే కేసీఆర్ బాబ్లీ గురించి పట్టించుకోకపోవడం విడ్డూరం. రాజకీయం కోసమే తెలంగాణా వాదం తప్ప ప్రజల మేలు కోసం కాదన్నది ఆ పార్టీ పాలసీ ఏమో!
ఇక మా పార్టీ హయాంలో తెలంగాణా ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణా ప్రజలు మమ్మల్నే గెలిపించాలి అని పిలుపు నిచ్చే కాంగ్రెస్స్, బాబ్లీ గురించి ఎనాడైన పట్టించుకుని ఉంటె సమస్య ఇంత దాక వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా చంద్రబాబుని ఆడిపోసుకోవడం తప్ప ఆ విషయం మాకు సంబంధించింది కానే కాదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఈ విషయంలో కేంద్రం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇది రెండు రాష్ట్రాల సమస్య అట. రాష్ట్రం నుంచి ముడుపులు కావాలి. రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణా విషయంలో వేలు పెట్టి లబ్ది పొందాలి. కాని బాబ్లి దగ్గరికి వచ్చే సరికి మీరు మీరూ చూసుకోండి అని తప్పించుకుంటారు. కారణం రెండు రాష్ట్రాల్లో ఉన్నది మన పార్టీనే మరి. అందుకే ఇలా మొహం చాటేయడం. అదే ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట వేరే పార్టీ అధికారంలో ఉంటె ఇలాగే మాట్లాడే వారా? పెద్ద రగడ చేసేవారు కాదా? కేంద్ర రాజకీయం మరి!
ఇక కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేని స్థితిలోనే ఉంటుంది. బాబు గొడవతో చిరు చేసిన ఏడుకొండల పాద యాత్ర పబ్లిసిటీకి నోచుకోకుండా పోయింది. సమైక్య నినాదంతో తెలంగాణలో పోగొట్టుకున్న అభిమానాన్ని బాబ్లి విషయంలో చంద్ర బాబుకు మద్దతివ్వడం ద్వారా సంపాదిన్చుకున్దామా అంటే, ఈ మధ్యే కాంగ్రెస్స్ తో కొత్త దోస్తాన కలిసిన్దాయే. వారి మాటే వీరి మాట, వారి బాటయే వీరి బాటగా పరిస్థితి ఉంది. అందుకని వారేమి మాట్లాడే స్థితిలో లేరు.
ఇక వామపక్షాలు కూడా బాబ్లీ విషయంలో చురుకుగా ఏమీ లేరు. కారణం ఏంటో?
ఇలా పార్టీలన్నీ స్వలాభాలే చూసుకుంటుంటే అసలు సమస్య తీరేదెప్పుడు? ఎలాగూ ఏదో కారణంతో బాబు విషయాన్ని ఇంతదాకా లాక్కొచ్చాడు కాబట్టి , పైగా ఇది రాష్ట్ర రైతులందరి సమస్య కాబట్టి, పార్టీలన్నీ భేషజాలను , స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలి. ఇది పార్టీల సమస్య కాదు. ప్రజల సమస్య. రాష్ట్ర సమస్య. అంతకన్నా మించి ఇది మన ఐక్యతను , ఆత్మగౌరవాన్ని చాటే సందర్భం. మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా వాటిని పక్కన పెడదాం. నిజమైన ప్రజా సమస్య గురించి పోరాడదాం.
కొసమెరుపు: మన రాజకీయ నాయకులకు కటిక నేలపై , దోమల మద్య, సరైన సౌకర్యాలు లేని చోట నిద్రించడం అంటే ఏమిటో , ఇలాంటి జీవితాన్ని నిత్యం ఎంత మంది ప్రజలు ఎలా నెట్టుకు వస్తున్నారో అర్థం అయ్యే అవకాశం కలింగించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకందుకు అభినందించాల్సిందే. మహిళా నాయకులూ ! ఈ మాత్రం దానికే కంటినుండి నీళ్ళు వచ్చాయే మీకు. మీ నియోజక వర్గాల్లో ఎంత మంది మహిళలు ఇలాంటి ప్రత్యక్ష నరకంలో జీవిస్తున్నారో ఇకనైనా ఆరా తీసి, వారి కోసం ఏమైనా చెయ్యగలరా?
తెలంగాణా తన సొత్తు అని భావించే కేసీఆర్ బాబ్లీ గురించి పట్టించుకోకపోవడం విడ్డూరం. రాజకీయం కోసమే తెలంగాణా వాదం తప్ప ప్రజల మేలు కోసం కాదన్నది ఆ పార్టీ పాలసీ ఏమో!
ఇక మా పార్టీ హయాంలో తెలంగాణా ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణా ప్రజలు మమ్మల్నే గెలిపించాలి అని పిలుపు నిచ్చే కాంగ్రెస్స్, బాబ్లీ గురించి ఎనాడైన పట్టించుకుని ఉంటె సమస్య ఇంత దాక వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా చంద్రబాబుని ఆడిపోసుకోవడం తప్ప ఆ విషయం మాకు సంబంధించింది కానే కాదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఈ విషయంలో కేంద్రం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇది రెండు రాష్ట్రాల సమస్య అట. రాష్ట్రం నుంచి ముడుపులు కావాలి. రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణా విషయంలో వేలు పెట్టి లబ్ది పొందాలి. కాని బాబ్లి దగ్గరికి వచ్చే సరికి మీరు మీరూ చూసుకోండి అని తప్పించుకుంటారు. కారణం రెండు రాష్ట్రాల్లో ఉన్నది మన పార్టీనే మరి. అందుకే ఇలా మొహం చాటేయడం. అదే ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట వేరే పార్టీ అధికారంలో ఉంటె ఇలాగే మాట్లాడే వారా? పెద్ద రగడ చేసేవారు కాదా? కేంద్ర రాజకీయం మరి!
ఇక కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేని స్థితిలోనే ఉంటుంది. బాబు గొడవతో చిరు చేసిన ఏడుకొండల పాద యాత్ర పబ్లిసిటీకి నోచుకోకుండా పోయింది. సమైక్య నినాదంతో తెలంగాణలో పోగొట్టుకున్న అభిమానాన్ని బాబ్లి విషయంలో చంద్ర బాబుకు మద్దతివ్వడం ద్వారా సంపాదిన్చుకున్దామా అంటే, ఈ మధ్యే కాంగ్రెస్స్ తో కొత్త దోస్తాన కలిసిన్దాయే. వారి మాటే వీరి మాట, వారి బాటయే వీరి బాటగా పరిస్థితి ఉంది. అందుకని వారేమి మాట్లాడే స్థితిలో లేరు.
ఇక వామపక్షాలు కూడా బాబ్లీ విషయంలో చురుకుగా ఏమీ లేరు. కారణం ఏంటో?
ఇలా పార్టీలన్నీ స్వలాభాలే చూసుకుంటుంటే అసలు సమస్య తీరేదెప్పుడు? ఎలాగూ ఏదో కారణంతో బాబు విషయాన్ని ఇంతదాకా లాక్కొచ్చాడు కాబట్టి , పైగా ఇది రాష్ట్ర రైతులందరి సమస్య కాబట్టి, పార్టీలన్నీ భేషజాలను , స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలి. ఇది పార్టీల సమస్య కాదు. ప్రజల సమస్య. రాష్ట్ర సమస్య. అంతకన్నా మించి ఇది మన ఐక్యతను , ఆత్మగౌరవాన్ని చాటే సందర్భం. మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా వాటిని పక్కన పెడదాం. నిజమైన ప్రజా సమస్య గురించి పోరాడదాం.
కొసమెరుపు: మన రాజకీయ నాయకులకు కటిక నేలపై , దోమల మద్య, సరైన సౌకర్యాలు లేని చోట నిద్రించడం అంటే ఏమిటో , ఇలాంటి జీవితాన్ని నిత్యం ఎంత మంది ప్రజలు ఎలా నెట్టుకు వస్తున్నారో అర్థం అయ్యే అవకాశం కలింగించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకందుకు అభినందించాల్సిందే. మహిళా నాయకులూ ! ఈ మాత్రం దానికే కంటినుండి నీళ్ళు వచ్చాయే మీకు. మీ నియోజక వర్గాల్లో ఎంత మంది మహిళలు ఇలాంటి ప్రత్యక్ష నరకంలో జీవిస్తున్నారో ఇకనైనా ఆరా తీసి, వారి కోసం ఏమైనా చెయ్యగలరా?
26, మే 2010, బుధవారం
నా సిమ్లా పర్యటన
వేసవికాలం సమీపిస్తోంది. సమ్మర్ టూర్ కోసం ప్లాన్ చేసుకోవలసిన సమయం ఇది. అందుకే నా టూర్ అనుభవాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చదువరులకు కొంతలో కొంత ఈ బ్లాగు ఉపయోగపడుతుందని నా ఆలోచన.
ప్రతి వేసవిలోనూ ఏదో ఒక పర్యాటక కేంద్రానికి, ముఖ్యంగా హిల్ స్టేషన్లకి వెళ్ళడం మాకు ఇష్టం , అలవాటు కూడా. ఎప్పటినుంచో సిమ్లాకి వెళ్లాలని కోరిక. ఆ కోరిక క్రిందటి వేసవిలో తీరింది. నాలుగు నెలల ముందుగానే ప్రణాళికలు మొదలయ్యాయి. ముందుగా బడ్జెట్ అంచనా వేస్తే ఎనభై వేల దాకా తేలింది. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాం కాబట్టి పలానా ప్రదేశాన్ని కూడా చూసొద్దాం అంటూ ఒక్కో ప్రదేశాన్ని కలుపుకుంటూ పోయే సరికి అంత బడ్జెట్ తేలింది. మా ఆవిడ ప్రభుత్వోద్యోగి కావడంతో రెండు బ్లాకుల ఎల్టీసిని ఈ పర్యటన కోసం వాడుకోవాలనుకున్నాం. అలాగే సిమ్లా, మనాలిలలో ఉన్న వాళ్ళ హాలిడే హోమ్స్ లో గదులను బుక్ చేసాం. ఎ.పి. ఎక్స్ ప్రేస్సుకు వెళ్ళేటప్పుడు సెకండ్ ఏసిలో , వచ్చేటప్పుడు థర్డ్ ఎసి లో టికెట్లు బుక్ చేసాం. అన్నీ ఫిబ్రవరిలోనే.
అంత ముందుగా బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ కావడానికి మూడు నాలుగు రోజులు పట్టింది. అందుకే సమ్మర్ టూర్ ను ఎప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. డిల్లీ నుంచి మిగతా టూర్ కోసం సిక్స్ సీటర్ వెహికిల్ బుక్ చేసాం. కిలోమీటరుకు తొమ్మిది రూపాయలు చొప్పున మాట్లాడుకున్నాం. నిజానికి ఢిల్లీ నుంచీ షిమ్లా వరకు రైలు సౌకర్యం ఉంది. అయితే లగేజిని, మా బృందంలో ఉన్న పెద్దలు, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని టాక్సీ లో వెళ్ళాలనుకున్నాం. అదెంత పొరబాటో తర్వాత తెలిసింది.
టూరుకు వెళ్ళేంత వరకు రోజుకో ఆలోచన. రోజుకో ప్రణాళిక. ఎంతో ఉత్సుకత. అక్కడి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు స్వీప్ పనోరమ సౌకర్యం ఉన్న సైబర్ షాట్ కెమెరాను కొన్నాం. దాదాపు ప్రతిరోజు టూర్ గురించి కాంత డిస్కషన్. అంతకు ముందే వెళ్లి వచ్చిన వాళ్ళు తగిన సజెషన్స్ ఇచ్చారు. నేనైతే ఇంటర్నెట్లో బోలెడంత సమాచారాన్ని సేకరించాను. అయితే టూమచ్ ఇన్ఫర్మేషన్ కూడా కాస్త కన్ఫ్యూషన్ను తెచ్చి పెడుతుంది. ముందుగా మేమనుకున్న రూట్ ఇది.
హైదరాబాద్ -డిల్లీ- చండీఘర్-సిమ్లా-కులు-మనాలి-భాక్రానంగల్ డ్యాం-చండీఘర్ -డిల్లీ-హైదరాబాద్
ఆదివారం ఉదయం ఎపి ఎక్స్ ప్రెస్ ఎక్కి డిల్లీకి బయలుదేరడంతో మా ప్రయాణం మొదలైంది.
మొదటి రోజు: రైలు ప్రయాణంతోనే గడిచింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1670కి.మీ. వేసవికాలమే అయినా ఎసి కోచ్ కాబట్టి ప్రయాణం హాయిగానే సాగింది.
రెండవ రోజు: ఉదయం తొమ్మిదిన్నరకు న్యూడిల్లీ చేరుకున్నాం. అక్కడ మా ఆవిడ కొలీగ్ ఒకాయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ట్రావెల్స్ వాళ్ళ వెహికిల్ ను మాట్లాడి పెట్టింది ఆయనే. వాహనాన్ని కూడా వెంట పెట్టుకోచ్చిన ఆయన ముందుగా వాళ్ళ ఆఫీసుకు తీసుకువెళ్ళి మర్యాద చేసి మమ్మల్ని చండీఘర్ కు సాగనంపారు.
డిల్లీ నుంచి చండీఘర్ కు మా ప్రయాణం ఉదయం పదకొండున్నరకు మొదలైంది. మా డ్రైవర్ పేరు తివారి. ఎసి వెయ్యమంటారా అని అడిగాడు. వేస్తే కిలోమీటరుకు మరో రూపాయి అదనంగా ఇవ్వాలి. ఎలాగు వెళ్తోంది చల్లటి ప్రదేశానికి కదా, వద్దులే అన్నాం. డిల్లీ పొలిమేరలకు వచ్చే సరికి వడగాడ్పుల సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ చాలా నయమనిపించింది. నిజానికి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికి అక్కడ ఎండలు అదర కొడుతున్నాయి. తప్పించుకుని వెళ్తున్నాం కదా అనుకుంటే ఢిల్లీ ఇంకా ఘోరంగా ఉంది. హైవే మాత్రం సూపర్. స్ట్రైట్ లైన్ మాదిరిగా తిన్నగ్గా , విశాలంగా ఉంది. ఇది ఒకటవ నంబర్ జాతీయ రహదారి. పానిపట్,కురుక్షేత్ర, అంబాల, అమృతసర్ ల మీదుగా వెళ్తుంది.
కురుక్షేత్ర చూస్తారా అడిగాడు తివారి. మా ప్లాన్నింగ్ లో కురుక్షేత్రం, పానిపట్టు ఉన్నాయి కాబట్టి ముందుగా పానిపట్టుచూస్తాం అన్నాం. భారతదేశ చరిత్రలో చాలా ప్రాధాన్యత కలిగిన మూడు యుద్ధాలు జరిగాయి అక్కడ. అయితే ఇప్పుడుఅక్కడ చూసేందుకు ఒక మ్యూజియం తప్ప ఇంకేమీ లేవు అని డ్రైవరు చెప్పడంతో పానిపట్టు సందర్శన కాన్సిల్అయ్యింది. తరువాత కురుక్షేత్రం. మహాభారత యుద్ధ భూమి. గీతాసారం భోధించిన పవిత్ర స్థలం. ఎవరికైనాచూడాలనిపిస్తుంది కదా! డిల్లీ నుంచి కురుక్షేత్రం 166 కిలో మీటర్లు.
(మిగతాది 'కురుక్షేత్ర' శీర్షికతో ఉన్న బ్లాగులో చదవండి)
ప్రతి వేసవిలోనూ ఏదో ఒక పర్యాటక కేంద్రానికి, ముఖ్యంగా హిల్ స్టేషన్లకి వెళ్ళడం మాకు ఇష్టం , అలవాటు కూడా. ఎప్పటినుంచో సిమ్లాకి వెళ్లాలని కోరిక. ఆ కోరిక క్రిందటి వేసవిలో తీరింది. నాలుగు నెలల ముందుగానే ప్రణాళికలు మొదలయ్యాయి. ముందుగా బడ్జెట్ అంచనా వేస్తే ఎనభై వేల దాకా తేలింది. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాం కాబట్టి పలానా ప్రదేశాన్ని కూడా చూసొద్దాం అంటూ ఒక్కో ప్రదేశాన్ని కలుపుకుంటూ పోయే సరికి అంత బడ్జెట్ తేలింది. మా ఆవిడ ప్రభుత్వోద్యోగి కావడంతో రెండు బ్లాకుల ఎల్టీసిని ఈ పర్యటన కోసం వాడుకోవాలనుకున్నాం. అలాగే సిమ్లా, మనాలిలలో ఉన్న వాళ్ళ హాలిడే హోమ్స్ లో గదులను బుక్ చేసాం. ఎ.పి. ఎక్స్ ప్రేస్సుకు వెళ్ళేటప్పుడు సెకండ్ ఏసిలో , వచ్చేటప్పుడు థర్డ్ ఎసి లో టికెట్లు బుక్ చేసాం. అన్నీ ఫిబ్రవరిలోనే.
అంత ముందుగా బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ కావడానికి మూడు నాలుగు రోజులు పట్టింది. అందుకే సమ్మర్ టూర్ ను ఎప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. డిల్లీ నుంచి మిగతా టూర్ కోసం సిక్స్ సీటర్ వెహికిల్ బుక్ చేసాం. కిలోమీటరుకు తొమ్మిది రూపాయలు చొప్పున మాట్లాడుకున్నాం. నిజానికి ఢిల్లీ నుంచీ షిమ్లా వరకు రైలు సౌకర్యం ఉంది. అయితే లగేజిని, మా బృందంలో ఉన్న పెద్దలు, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని టాక్సీ లో వెళ్ళాలనుకున్నాం. అదెంత పొరబాటో తర్వాత తెలిసింది.
టూరుకు వెళ్ళేంత వరకు రోజుకో ఆలోచన. రోజుకో ప్రణాళిక. ఎంతో ఉత్సుకత. అక్కడి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు స్వీప్ పనోరమ సౌకర్యం ఉన్న సైబర్ షాట్ కెమెరాను కొన్నాం. దాదాపు ప్రతిరోజు టూర్ గురించి కాంత డిస్కషన్. అంతకు ముందే వెళ్లి వచ్చిన వాళ్ళు తగిన సజెషన్స్ ఇచ్చారు. నేనైతే ఇంటర్నెట్లో బోలెడంత సమాచారాన్ని సేకరించాను. అయితే టూమచ్ ఇన్ఫర్మేషన్ కూడా కాస్త కన్ఫ్యూషన్ను తెచ్చి పెడుతుంది. ముందుగా మేమనుకున్న రూట్ ఇది.
హైదరాబాద్ -డిల్లీ- చండీఘర్-సిమ్లా-కులు-మనాలి-భాక్రానంగల్ డ్యాం-చండీఘర్ -డిల్లీ-హైదరాబాద్
ఆదివారం ఉదయం ఎపి ఎక్స్ ప్రెస్ ఎక్కి డిల్లీకి బయలుదేరడంతో మా ప్రయాణం మొదలైంది.
మొదటి రోజు: రైలు ప్రయాణంతోనే గడిచింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1670కి.మీ. వేసవికాలమే అయినా ఎసి కోచ్ కాబట్టి ప్రయాణం హాయిగానే సాగింది.
రెండవ రోజు: ఉదయం తొమ్మిదిన్నరకు న్యూడిల్లీ చేరుకున్నాం. అక్కడ మా ఆవిడ కొలీగ్ ఒకాయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ట్రావెల్స్ వాళ్ళ వెహికిల్ ను మాట్లాడి పెట్టింది ఆయనే. వాహనాన్ని కూడా వెంట పెట్టుకోచ్చిన ఆయన ముందుగా వాళ్ళ ఆఫీసుకు తీసుకువెళ్ళి మర్యాద చేసి మమ్మల్ని చండీఘర్ కు సాగనంపారు.
డిల్లీ నుంచి చండీఘర్ కు మా ప్రయాణం ఉదయం పదకొండున్నరకు మొదలైంది. మా డ్రైవర్ పేరు తివారి. ఎసి వెయ్యమంటారా అని అడిగాడు. వేస్తే కిలోమీటరుకు మరో రూపాయి అదనంగా ఇవ్వాలి. ఎలాగు వెళ్తోంది చల్లటి ప్రదేశానికి కదా, వద్దులే అన్నాం. డిల్లీ పొలిమేరలకు వచ్చే సరికి వడగాడ్పుల సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ చాలా నయమనిపించింది. నిజానికి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికి అక్కడ ఎండలు అదర కొడుతున్నాయి. తప్పించుకుని వెళ్తున్నాం కదా అనుకుంటే ఢిల్లీ ఇంకా ఘోరంగా ఉంది. హైవే మాత్రం సూపర్. స్ట్రైట్ లైన్ మాదిరిగా తిన్నగ్గా , విశాలంగా ఉంది. ఇది ఒకటవ నంబర్ జాతీయ రహదారి. పానిపట్,కురుక్షేత్ర, అంబాల, అమృతసర్ ల మీదుగా వెళ్తుంది.
కురుక్షేత్ర చూస్తారా అడిగాడు తివారి. మా ప్లాన్నింగ్ లో కురుక్షేత్రం, పానిపట్టు ఉన్నాయి కాబట్టి ముందుగా పానిపట్టుచూస్తాం అన్నాం. భారతదేశ చరిత్రలో చాలా ప్రాధాన్యత కలిగిన మూడు యుద్ధాలు జరిగాయి అక్కడ. అయితే ఇప్పుడుఅక్కడ చూసేందుకు ఒక మ్యూజియం తప్ప ఇంకేమీ లేవు అని డ్రైవరు చెప్పడంతో పానిపట్టు సందర్శన కాన్సిల్అయ్యింది. తరువాత కురుక్షేత్రం. మహాభారత యుద్ధ భూమి. గీతాసారం భోధించిన పవిత్ర స్థలం. ఎవరికైనాచూడాలనిపిస్తుంది కదా! డిల్లీ నుంచి కురుక్షేత్రం 166 కిలో మీటర్లు.
(మిగతాది 'కురుక్షేత్ర' శీర్షికతో ఉన్న బ్లాగులో చదవండి)
1, మే 2010, శనివారం
29, ఏప్రిల్ 2010, గురువారం
శ్వాస ధాత్రి

నిన్న టీవి వార్తలు చూస్తుంటే అందులో ఒక మంచి వార్త!
కొంత మంది ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఒక పరికరాన్ని కనిపెట్టారు. దాని పేరు 'శ్వాస ధాత్రి' . బోరుబావుల్లో పడిప్రాణాలు కోల్పోతున్న పిల్లలను సురక్షితంగా బయటకు తీయడానికి ఉపయోగపడే పరికరం. కనీసం బయటకు తీసేంతవరకైనా పిల్లల ప్రాణాలను నిలిపే పరికరం. వారిలో భయాన్ని, ఆందోళనని తొలగించే పరికరం. నీకేం కాలేదు, మేమంతా నీతోనే ఉన్నాం అని ఆ లేత మనసుకు ధైర్యం చెప్పడానికి పనికి వచ్చే పరికరం. ఇంకా ఎన్ని ప్రయోజనాలుఉన్నాయో, అసలు ప్రయోగదశను దాటి క్షేత్ర స్థాయికి వచ్చాక ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందో తెలీదు కాని ఇక్కడసంతోషకరమైన విషయం ఏంటంటే ఆ విద్యార్థులు చేసిన ప్రయత్నం, వారి ఆలోచించిన విధానం, లోకం తెలియనివయసులో నానా హింసను అనుభవించి సమాజ నిర్లక్ష్యానికి ఘోరంగా బలయిపోతున్న పసివాళ్ళ కోసం ఏదన్నాచేయాలన్న తపన వారిలో కలగడం. వాళ్ళు కూడా నిన్నా మొన్నటి పసివాళ్ళే. అయినా ఎంత పెద్ద ఆలోచన! సమాజంపట్ల ఎంతటి బాద్యత!
ప్రజాసేవ కోసమే మేమున్నామనే రాజకీయ పెద్దలు, ప్రజల రక్షణకే మేము పని చేస్తున్నామనే రక్షక భటులు, రేపటిపౌరుల మీద ఎక్కడలేని బాద్యతను నెత్తిన ఏసుకుని 'ఆట'ను ఆపమని గగ్గోలు పెట్టె సామాజిక సంస్కర్తలు... వీరెవరికీకలగని స్పందన ఆ విద్యార్థులలో కలగడం హర్షణీయం. ఇదిగో వీళ్ళే.. ఇలాంటి విద్యార్థులే రేపటి సమాజాన్ని నడపబోయేసైనికులు అన్న ఆలోచన రేపటి ఉత్తమ సమాజం పై నాకు ఆసను కలిగిస్తుంది. ఏమో! ఈలోపు ఏ రాజకీయ శక్తి వారినితమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందో!..ఏ సిద్ధాంతాలు వారిని పక్కదారి పట్టిస్తాయో !.. ఏ ప్రాంతీయ తత్త్వం, ఏకుల తత్త్వం, ఏ మత తత్త్వం వారిని స్వార్థ పరులుగా మారుస్తుందోనని భయం కూడా ఉంది మరో ప్రక్క. ఏది ఏమైనా వారిప్రయత్నాన్ని హర్షిద్దాం. బ్లాగర్లు అందరూ ఈ విషయంపై మీవంతుగా స్పందించండి.
28, ఏప్రిల్ 2010, బుధవారం
మీడియా మానియా ..పాపం సానియా !
కొన్నాళ్ళ క్రితం ఇదే బ్లాగులో 'ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి' అన్న శీర్షికతో సానియా పెళ్లి విషయంలో మీడియాచూపిస్తున్న అత్యుత్సాహం గురించి రాసాను. పిలవని పేరంటానికి వెళ్లి అవమానాల పాలైనా, సానియా ఇంటి చూరుపట్టుకుని వేలాడి మరీ పెళ్లి ఘట్టాలను క్షణ క్షణం కళ్ళకు కట్టింది మీడియా . మొదట్లో అయాచితంగా వచ్చిన పబ్లిసిటీనికాదనలేక పోయినా కొత్త దంపతులను కాపురం కూడా చేసుకోనివ్వకుండా మీడియా తరుముతుంటే పాపం సానియా జంటఇకనైనా మా మానాన మమ్మల్ని వదలన్డంటూ బతిమిలాడుకోవలసి వచ్చింది. చెప్పించుకునేదాక రావడం అన్నది సిగ్గుపడాల్సిన విషయం కదా. దీన్నే 'అతి' అంటారేమో?
24, ఏప్రిల్ 2010, శనివారం
23, ఏప్రిల్ 2010, శుక్రవారం
ఈ వ్యవస్థలో కులమూ ఒక ఆయుధమే !
అసలు కులం అన్న భావననే రూపుమాపాలని సభ్య సమాజం భావిస్తోంటే సిగ్గులేని, నీతిలేని రాజకీయాలు ఆ కులభావనని స్వార్థ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, వ్యభిచారం చేస్తూ కెమెరాలకు దొరికినా, అక్రమాలు చేసినా , ఆక్రమణలు చేసినా '. పలానా కులం వాడిని కాబట్టి నామీద కుట్ర చేస్తున్నారు. ఇది అగ్రవర్ణాల అహంకారం.' అని సిగ్గు లేకుండా తప్పును కప్పి పుచ్చుకునేందుకు, దృష్టినిమళ్ళించేందుకు కులాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. రిజర్వేషన్లు గాని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రాధాన్యత గానిఆయా కులాల్లో ఉన్న పేదలను ఉన్నత స్థితికి తీసుకురాడానికి ఉద్దేశించినవి. అంతే కాని కులపిచ్చిని రెచ్చగొట్టడానికికాదు. కులాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయడానికి కాదు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నూకారపు సూర్య ప్రకాశ రావు అనే ఆయనపై కొన్నేళ్ళ క్రితం భూ ఆక్రమణలఆరోపణలు వచ్చాయి. వాటినుంచి బయట పడేందుకు కుల ప్రస్తావన తెచ్చి హంగామా చేసాడు. ఆ ఆరోపణలలో నిజంఎంత ఉందో తెలీదు కాని , ఆయనకు మాత్రం ప్రెస్ కు ఎంత పవరు ఉందో బాగా అర్థమైంది . అందుకే ఒక పత్రిక పెట్టేసి తనేఇతరుల అక్రమాల గురించి రాయడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే , పత్రికను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగుకు పాల్పడ్డాడని. జర్నలిజం నైతిక విలువలని మంటకలిపాడని. ఈఆరోపణలని అతను న్యాయపరంగా ఎదుర్కోవచ్చు. తన చేతిలోనే పత్రిక ఉంది కాబట్టి అవన్నీ అభూత కల్పనలని సాక్షిపత్రిక తరహాలో వినూత్న కథనాలు రాసుకోవచ్చు. పత్రికలూ కూడా స్వప్రయోజనాలకే అన్న విషయం జనానికి ఎప్పుడోతెలిసింది. ఎవరు ఏం రాసుకున్నా వాళ్ళు అడగరు. ఇవన్నీ కాకుండా ఈ కుల ప్రస్తావన ఎందుకు స్వామీ? నీతి అన్నదిమనిషిని బట్టి ఉంటుంది కాని కులాన్ని బట్టి కాదని పత్రికాధిపతులు తమకు తెలియదా? రాధా కృష్నది అహంకారమేఅనుకుందాం. అతనూ పత్రికను అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించాడనే అనుకుందాం. నువ్వు చేసింది అక్రమం అంటేఏం నువ్వు చెయ్యలేదా' అని అసెంబ్లీలోనే కాట్లాడు కున్న వ్యవస్థ మనది. న్యూస్ ఛానెలు పెట్టి ఒకడు, పత్రిక పెట్టి ఒకడు,పార్టీ పెట్టి ఒకడు, ఆశ్రమం పెట్టి ఒకడు ..ఇలా అందరూ అక్రమంగా సంపాదించుకోండి. మనది ప్రజాస్వామ్యం మరి. అందుకని మేమేమీ అడగం. కానీ ఈ కులాల వాదం తీసుకురాకండి. దండం పెడతాం.
'
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నూకారపు సూర్య ప్రకాశ రావు అనే ఆయనపై కొన్నేళ్ళ క్రితం భూ ఆక్రమణలఆరోపణలు వచ్చాయి. వాటినుంచి బయట పడేందుకు కుల ప్రస్తావన తెచ్చి హంగామా చేసాడు. ఆ ఆరోపణలలో నిజంఎంత ఉందో తెలీదు కాని , ఆయనకు మాత్రం ప్రెస్ కు ఎంత పవరు ఉందో బాగా అర్థమైంది . అందుకే ఒక పత్రిక పెట్టేసి తనేఇతరుల అక్రమాల గురించి రాయడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే , పత్రికను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగుకు పాల్పడ్డాడని. జర్నలిజం నైతిక విలువలని మంటకలిపాడని. ఈఆరోపణలని అతను న్యాయపరంగా ఎదుర్కోవచ్చు. తన చేతిలోనే పత్రిక ఉంది కాబట్టి అవన్నీ అభూత కల్పనలని సాక్షిపత్రిక తరహాలో వినూత్న కథనాలు రాసుకోవచ్చు. పత్రికలూ కూడా స్వప్రయోజనాలకే అన్న విషయం జనానికి ఎప్పుడోతెలిసింది. ఎవరు ఏం రాసుకున్నా వాళ్ళు అడగరు. ఇవన్నీ కాకుండా ఈ కుల ప్రస్తావన ఎందుకు స్వామీ? నీతి అన్నదిమనిషిని బట్టి ఉంటుంది కాని కులాన్ని బట్టి కాదని పత్రికాధిపతులు తమకు తెలియదా? రాధా కృష్నది అహంకారమేఅనుకుందాం. అతనూ పత్రికను అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించాడనే అనుకుందాం. నువ్వు చేసింది అక్రమం అంటేఏం నువ్వు చెయ్యలేదా' అని అసెంబ్లీలోనే కాట్లాడు కున్న వ్యవస్థ మనది. న్యూస్ ఛానెలు పెట్టి ఒకడు, పత్రిక పెట్టి ఒకడు,పార్టీ పెట్టి ఒకడు, ఆశ్రమం పెట్టి ఒకడు ..ఇలా అందరూ అక్రమంగా సంపాదించుకోండి. మనది ప్రజాస్వామ్యం మరి. అందుకని మేమేమీ అడగం. కానీ ఈ కులాల వాదం తీసుకురాకండి. దండం పెడతాం.
'
20, ఏప్రిల్ 2010, మంగళవారం
గుర్తుకొస్తున్నావు!
గుర్తుకొస్తున్నావు.
బాగా గుర్తుకొస్తున్నావు.
నిన్ను మర్చిపోవాలనుకున్న కొద్దీ గుర్తుకు వస్తున్నావు.
అసలు గుర్తుకు రావడం ఏంటి? మర్చిపోతేనే కదా గుర్తుకు రావడం అనేది ఉంటుంది. ఇది గుర్తుకు రావడం కాదు. మర్చిపోలేక పోవడం.
'అసలు నన్నెందుకు మర్చిపోవాలి?' అని నువ్వు నన్ను అడిగితే బాగుండు అనిపిస్తుంది. 'నన్ను ప్రేమిస్తున్నావా?' అనిఅడిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వేదీ అడగవు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నీ కోసం నా మనసు పడే బాధ నీకుఅర్థం కాక కాదు. అక్కర లేక. అందుకే విలవిల లాడుతున్న నన్ను చూస్తూ కూర్చుంటావు తప్ప ఏమైందని అడగవు. నేనూ చెప్పను. ఇది అహంకారం కాదు. నీ మీద ప్రేమే. నీకు అక్కరలేని వాటిని నిన్ను బతిమిలాడో, కన్వీన్స్ చేసో నీకుఎందుకు అంటగట్టాలి? నేనేమి సేల్స్ మాన్ని కాదు. ప్రేమికుడిని. నా ప్రేమ నీకు విలువైనదిగా అనిపించాలి. అరుదైనవరంలా అనిపించాలి. నీకు కావాలనిపించే అర్హతలు నేను పొందాలి. అపుడు నువ్వే అడుగుతావు. 'నన్నుప్రేమిస్తున్నావా?' అని.
అవన్నీ జరగాలంటే ముందు నిన్ను మర్చి పోవాలి. అందుకే ఈ ప్రయత్నం. నీకు తెలుసా? ఎవరో ఒక అనుభవశాలి ఇలాచెప్పాడు "సంతోషం అయినా ప్రేమ అయినా - మనం వాటి వెనకాల పరుగేత్తినంత కాలం దొరకవు. మనం ఆదమరపుగా ఉన్నపుడు సీతాకోక చిలుకలా మన భుజం మీదికి వచ్చి వాలతాయి.''
అందుకే నిన్ను నా మనసు దరి దాపుల్లోకి రానివ్వకూడదని అనుకుంటున్నాను. అయినా వదలవుగా నువ్వు. నీముఖంలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతాననే భయం. అందుకే నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకుంటాను. నీమాట వింటే మంత్రంలా నా మనసును కట్టిపడేస్తుందని భయం. నీకు దూరంగా ఉంటేనే నీ మాయ లోంచి నాకు విముక్తి. అందుకే ఈ దూరం ఇల్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు దగ్గరవ్వాలని అనుకునేదాకా ఈ దూరంకొనసాగాలి. నా ప్రేమ సీతాకోక చిలుకవు నువ్వు. నీ అంతట నువ్వే నా మనసు తోటలోకి వచ్చి వాలాలి. అప్పటికి దాకానీ లోకంలో నువ్వు హాయిగా, స్వేచ్చగా ఉండు. నీ సుఖాన్ని కోరుకోవడం కంటే ప్రేమకు పరమార్థం ఏముంది చెప్పు! నీకోసం తపించడంలో నాకు ఆనందం ఉంది. నీకోసం కలవరించడంలో నాకు మనశ్శాంతి ఉంది. నిన్ను ప్రేమిస్తూ ఉండటం నాకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. అసలు నిన్ను కలవడం అన్నది నేను గర్విస్తోన్న విషయం. చూసావా! ఇలా రాస్తూ రాస్తూ మళ్ళీ నీ మాయలో పడి ఎక్కడికో వెళ్లిపోతున్నా. ఇదే ప్రేమ మహిమ. కాదు నీ మహిమ. నువ్వు కలవక పోతే అసలు నాలో ఈ ప్రేమ ఎలా పుట్టేది?
బాగా గుర్తుకొస్తున్నావు.
నిన్ను మర్చిపోవాలనుకున్న కొద్దీ గుర్తుకు వస్తున్నావు.
అసలు గుర్తుకు రావడం ఏంటి? మర్చిపోతేనే కదా గుర్తుకు రావడం అనేది ఉంటుంది. ఇది గుర్తుకు రావడం కాదు. మర్చిపోలేక పోవడం.
'అసలు నన్నెందుకు మర్చిపోవాలి?' అని నువ్వు నన్ను అడిగితే బాగుండు అనిపిస్తుంది. 'నన్ను ప్రేమిస్తున్నావా?' అనిఅడిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వేదీ అడగవు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నీ కోసం నా మనసు పడే బాధ నీకుఅర్థం కాక కాదు. అక్కర లేక. అందుకే విలవిల లాడుతున్న నన్ను చూస్తూ కూర్చుంటావు తప్ప ఏమైందని అడగవు. నేనూ చెప్పను. ఇది అహంకారం కాదు. నీ మీద ప్రేమే. నీకు అక్కరలేని వాటిని నిన్ను బతిమిలాడో, కన్వీన్స్ చేసో నీకుఎందుకు అంటగట్టాలి? నేనేమి సేల్స్ మాన్ని కాదు. ప్రేమికుడిని. నా ప్రేమ నీకు విలువైనదిగా అనిపించాలి. అరుదైనవరంలా అనిపించాలి. నీకు కావాలనిపించే అర్హతలు నేను పొందాలి. అపుడు నువ్వే అడుగుతావు. 'నన్నుప్రేమిస్తున్నావా?' అని.
అవన్నీ జరగాలంటే ముందు నిన్ను మర్చి పోవాలి. అందుకే ఈ ప్రయత్నం. నీకు తెలుసా? ఎవరో ఒక అనుభవశాలి ఇలాచెప్పాడు "సంతోషం అయినా ప్రేమ అయినా - మనం వాటి వెనకాల పరుగేత్తినంత కాలం దొరకవు. మనం ఆదమరపుగా ఉన్నపుడు సీతాకోక చిలుకలా మన భుజం మీదికి వచ్చి వాలతాయి.''
అందుకే నిన్ను నా మనసు దరి దాపుల్లోకి రానివ్వకూడదని అనుకుంటున్నాను. అయినా వదలవుగా నువ్వు. నీముఖంలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతాననే భయం. అందుకే నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకుంటాను. నీమాట వింటే మంత్రంలా నా మనసును కట్టిపడేస్తుందని భయం. నీకు దూరంగా ఉంటేనే నీ మాయ లోంచి నాకు విముక్తి. అందుకే ఈ దూరం ఇల్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు దగ్గరవ్వాలని అనుకునేదాకా ఈ దూరంకొనసాగాలి. నా ప్రేమ సీతాకోక చిలుకవు నువ్వు. నీ అంతట నువ్వే నా మనసు తోటలోకి వచ్చి వాలాలి. అప్పటికి దాకానీ లోకంలో నువ్వు హాయిగా, స్వేచ్చగా ఉండు. నీ సుఖాన్ని కోరుకోవడం కంటే ప్రేమకు పరమార్థం ఏముంది చెప్పు! నీకోసం తపించడంలో నాకు ఆనందం ఉంది. నీకోసం కలవరించడంలో నాకు మనశ్శాంతి ఉంది. నిన్ను ప్రేమిస్తూ ఉండటం నాకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. అసలు నిన్ను కలవడం అన్నది నేను గర్విస్తోన్న విషయం. చూసావా! ఇలా రాస్తూ రాస్తూ మళ్ళీ నీ మాయలో పడి ఎక్కడికో వెళ్లిపోతున్నా. ఇదే ప్రేమ మహిమ. కాదు నీ మహిమ. నువ్వు కలవక పోతే అసలు నాలో ఈ ప్రేమ ఎలా పుట్టేది?
19, ఏప్రిల్ 2010, సోమవారం
ప్రేమ - ఆక్సిజన్

ప్రేమ కూడా అలాంటిదే. మనసుకు ఆక్సిజన్ లాంటిది. జీవితానికి వెలుగు లాంటిది. తెలిసో తెలీకో దాని ఆధారంగానే మనందరం బ్రతుకుతున్నాం. కాకపోతే దాని ప్రాధాన్యతని గుర్తించడం లేదు అంతే. జీవితంలో ప్రతిక్షణం అవసరమైన ప్రేమను కేవలం టీనేజి వయసుకే పరిమితం చేసి ఆ వయసులో ఉండే ఆకర్షననే ప్రేమ అంటున్నాం. దాని ఆధారంగానే సినిమాలు తీసేస్తున్నాం. ఇంతేనా ప్రేమ గురించి మనం తెలుసుకుంది? జీవితంలో ఏ వయసులో అయినా ప్రేమ గురించి మాట్లాడుకోవచ్చని , ప్రేమకు లోనవడంలో తప్పు లేదని, అది సహజం అనీ ఎంద్కుకు తెలుసుకోం? తీరిక లేకా? తెలీకా?
ప్రేమ ప్రాధాన్యత తెలుసుకుంటే తెలియని ఒంటరితనంతో..ఏదో లోటుతో.. నిస్సారంగా, బ్రతుకును యంత్రంలా నెట్టుకొస్తూ.. తనలో తాను తెలియని అసంతృప్తితో రగిలిపోతూ... మనసులో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నించే ఒక ఇల్లాలిని అర్థం చేసుకోవచ్చు కదా. టీనేజి వయసులో పక్క దారులు తొక్కే పిల్లల్ని అర్థం చేసుకోవచ్చుకదా. మలివయసులో ప్రాధాన్యతను కోల్పోయి, నిరాదరణకు గురయిన పెద్దవాళ్ళను అర్థం చేసుకోవచ్చు కదా.
ప్రేమ గురించి తెలుసుకుందాం. ప్రేమ గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో ప్రేమ ఎక్కడుందో, ఏస్థాయిలో ఉందో తెలుసుకుందాం. ప్రేమను ఇద్దాం. ప్రేమను తీసుకుందాం.
13, ఏప్రిల్ 2010, మంగళవారం
12, ఏప్రిల్ 2010, సోమవారం
6, ఏప్రిల్ 2010, మంగళవారం
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి!

అనగనగా ఒక సానియా. పెద్ద అందగత్తె ఏమీ కాదు. కాకపోతే ఆ పదహారు ప్రాయాన సహజంగా ఉండే ఆకర్షణ కూసిన్త ఉండింది. పైగా ఆ పిల్ల ఆడే ఆట అలాంటిది. దాంతో అందం కంటే గ్లామర్కి పిచ్చెక్కి పోయే కుర్రాళ్ళకి సానియా ఒక మానియా అయిపోయింది. మానియా ఎక్కడ ఉంటె అక్కడ, అతి చేయడానికి మీడియా ఉండనే ఉంది. ఆట ఏమాత్రంఆడిందో , ఒక షరపోవ కంటే ఏమంత గొప్పదో, ఒక కోనేరు హంపి కన్నా ఎంత టాలెంట్ ఉన్న క్రీడాకారినో మీడియానేచెప్పాలి. దీంతో ఆవిడ అటు ఆట తోనూ , ఇటు ప్రకటనల తోను పిచ్చ పిచ్చగా సంపాదించింది.
అది చాలదన్నట్టు... ఆవిడ మైనారిటీ వర్గానికి చెందినది కావడంతో, ఆ వర్గానికి ఎక్కడ లేని 'చేయి ' ఊత మిచ్చేప్రభుత్వం ఐ మీన్ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు రెండూ అదే పార్టీవి కావడంతో వద్దన్నా తీసుకోమంటూ ప్రోత్సాహకాలను తెగఇచ్చి పడేశాయి. ఇంటి స్థలం దగ్గరనుంచి పద్మశ్రీ వరకు దారాదత్తం చేసాయి. అందగత్తెలనగానే ఇటు సమాజం ఎంతఉదారత్వం చూపిస్తుందో , అటు రాజకీయ నాయకులు కూడా అంత ఉదారత్వం చూపిస్తారు. పాపం వారు కూడాసమాజంలో మనుషులే కదా! పైగా జేబులోంచి పైసా కూడా తీయనక్కర లేదాయే. ప్రజల సొమ్ము అప్పనంగా ఎవరికైనాఒప్ప చెప్పే అధికారం వాళ్లకు ఉంది. ఆ రకంగా పల్లికిలించుకుంటూ అందరూ కలిసి ఆ పిల్లని ఆకాశానికి ఎత్తేసారు.ఎంతగా ఎత్తేసారంటే .. ఆ పిల్ల ఆడటం కూడా మర్చిపోయింది. పాపం!
అదంతా గతం. ఇప్పుడు ఆవిడ ఒక విదేశీయుడిని పెళ్లి చేసుకుని వెళ్లి పోతానని, మరో దేశంలో కాపురం పెడతాననిచెపుతోంది. మామూలుగా అయితే ఒక ఆడపిల్లగా ఆవిడ అభిప్రాయాన్ని , ఇష్టా ఇష్టాలను ఎవరూ కాదనరు. కాని ఇన్నిప్రయోజనాలు, ఇంత గౌరవం ఈ దేశం నుండి పొందాక ఒక సెలెబ్రిటీ గా తను చాలా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. షోయబ్ ను పెళ్లి చేసుకోవడం ఎవరూ కాదనరు. అతన్నే వచ్చి ఇక్కడ ఇల్లరికం ఉండమన వచ్చుగా అని మాత్రంఆలోచిస్తారు. ఏది ఏమైనా సానియా నిర్ణయం..ఆమెను అతిగా గారాబం చేసిన మన వాళ్ళను చెంప చెల్లుమనిపించేలాఉంది. దిలీప్ కుమార్ లాంటి కళాకారులను చూసి సానియా నేర్చుకోవాలి.
ఇదంతా ఒక తంతయితే ప్రతి రోజూ ఆవిడ పెళ్లి వార్తలని పతాక శీర్షికగా పెట్టుకుని మీడియా చేస్తోన్న హడావిడిపుండుమీద కారం చల్లినట్టుగా ఉంది. వాళ్ళ వ్యక్తిగత గొడవని రాష్ట్రీయ, జాతీయ సమస్య కంటే ఎక్కువ అన్నట్టు చిత్రీకరించి చెపుతున్నారు. పేదరికం వల్ల మధ్యలోనే చదువును ఆపేసి కూలీలుగా మారిన వాళ్ళ గురించి ఇంత పబ్లిసిటీఎప్పుడైనా చేసారా. చేయరు. ఎందుకంటే ఆ వార్తలో మానవత్వం, సమాజ , ప్రభుత్వ బాధ్యతలు గురించి గుచ్చి చెప్పడంతప్ప గ్లామర్ లేదుగా.
అందుకే నాకీ జాతీయం గుర్తొచ్చింది ''ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి''
24, మార్చి 2010, బుధవారం
తారక మంత్రం

''శ్రీరామ రామ రామేతి
రమే రామ మనోరమే
సహస్రనామ తతుల్యం
రామ నామ వరాననే ''
పెళ్ళికి ముందే 'అది' -అందులో తప్పేంటి?
ఆంధ్రజ్యోతి దిన పత్రికలో పతాక శీర్షిక. పెళ్ళికి ముందే సహజీవనం చేస్తే తప్పేంటి? అని సుప్రీం కోర్ట్ ఎదురు ప్రశ్నించింది. ఇలాంటి సందర్భంలో ఆదర్శ దంపతులుగా పురాణాలు మన ముందు నిలిపిన సీతా రాములకు కళ్యాణంజరిపిస్తున్నాం.
నేడు సుప్రీం అనుకున్నట్టే నాడు రావణుని చెరలో ఉన్న సీత ''ఇన్ని కస్టాలు పడే కంటే ఈ రావణుని కోర్కె తీరిస్తేతప్పేముంది?'' అని అనుకుంటే ఈనాడు మన సంస్కృతి ఎలా ఉండేది?
మనిషన్నాక కోర్కెలు కలగడం సహజం! అలాగని వాటిని ఎలాగోలా తీర్చుకోవాలని అనుకుంటే ఎలా? నిగ్రహం అనేదిలేక పోతే మనిషికి పశువుకి తేడా ఏముంది? మన నిగ్రహాన్ని చాటేదే సంస్కారం. అలాంటి సంస్కారం గల మనుషుల్నికలిగి ఉన్న గుణమే సంస్కృతి.
కుష్బూ వాఖ్యలని తప్పు పట్టడం లేదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని తప్పు కాదు. కాని ఆ వాక్యాలని రచ్చ రచ్చ చేసి సుప్రీందాక వెళ్ళడం, ఈ విషయమై ఒక బహిరంగ చర్చకు తావీయడం అర్థం లేని పని.
23, మార్చి 2010, మంగళవారం
22, మార్చి 2010, సోమవారం
ద క్లాక్..!

నిద్రలో మెలకువ వచ్చింది. అయినా కళ్ళు తెరవలేదు. ఈ మధ్య ప్రతి రోజూ ఇలాగే జరుగుతోంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లకు ఇలాగే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మెలకువ వచ్చి నిద్రను పాడు చేస్తుందట. అందుకే రాత్రి భోజనంతర్వాత కనీసం గంట వరకు పక్కమీదికి పోగూడదని డాక్టర్లు అంటారు. చేయకూడదని తెలిసినా కొన్ని కొన్ని మనం చేయకుండా ఉండలేం. అది మన బలహీనత. ఏదయితేనేం? నాకు మెలకువ వచ్చింది. ఏవో ఆలోచనలు మొదలయ్యాయి.
టంగ్..
గోడ గడియారం గంటలు కొట్టడం మొదలుపెట్టింది. ఇదీ మామూలే. నాకు మెలకువ వచ్చిన కాసేపటికి రెండు గంటలు కొడుతుంది. అలా ఆలోచనలలో ఉండగా మూడు గంటలు కొడుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ నిద్రలోకి జారుకుంటాను. ఆ గడియారాన్ని మా అబ్బాయి మొదటి పుట్టిన రోజు ఫంక్షన్ కు ఎవరో ప్రజంట్ చేసారు. గిఫ్టు ప్యాక్ మీద పేరు రాయకపోవడంతో ఎవరు ఇచ్చారు అన్నది తెలీలేదు. వీడియోలోను, ఫొటోలలోనూ చూసినా తెలియలేదు. చూడడానికి మాత్రం చాలాబాగుంది.
టంగ్..రెండు
టంగ్..మూడు..
అరె! ఈ రోజు ఒక గంట ఆలస్యంగా మెలకువ వచ్చిందన్న మాట. అసలు రాత్రిళ్ళు ఇలా మెలకువ వచ్చి నిద్రను పాడుచెయ్యకుండా ఉంటె ఎంత బాగుండు! నిద్ర లేమితో మరిన్ని రోగాలు వస్తాయంట. స్మోక్ చెయ్యడం మానెయ్యాలి.
టంగ్..నాలుగు
పరవాలేదు. ఈ రోజు బాగానే నిద్ర పట్టిందే!
టంగ్.. అయిదు
అప్పుడే అయిదయిందా!?
టంగ్.. ఆరు
ఆరు! నిజమా? అలా అయితే అయిదున్నరకి మొబైల్ ఫోన్లో అలారం పెట్టుకుని నిద్ర లేచే మా ఆవిడ ఇంకా లేవలేదేంటి? అలారం పెట్టుకోడం మర్చిపోయిందా? లేక అలారం మ్రోగినా మెలకువ రాలేదా? రోజూలా నాకెందుకు అర్థరాత్రి మెలకువరాలేదు? మా ఆవిడ వంక చూసాను. గాడ నిద్రలో ఉన్నట్టు ఉంది.
టంగ్.. ఏడు
మై గాడ్! పెద్దాడి స్కూలుకి టైం అయిపొయింది. ఇంకో పది నిమిషాలలో స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. వీళ్ళెవరు ఎందుకులేవలేదు? ఏం ..అయ్యింది?
టంగ్.. ఎనిమిది
కిటికీ వైపు చూసా. బయట చీకటిగానే ఉన్నట్టు ఉంది. ఒకవేళ గడియారంలో టైం తప్పుగా సెట్ చేసామా? మా పెద్దాడు దీన్ని కూడా కేలికాడన్నమాట. ఇంట్లో ప్రతి వస్తువును విప్పి చూడడం, అదెలా పని చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంచెయ్యడం వాడికి అలవాటే. మంచి అలవాటే. పెద్దయ్యాక ఇంజినీర్ అవుతాడేమో!
టంగ్.. తొమ్మిది
సందేహం లేదు! గడియారంలో సెట్ చేసిన టైం తప్పు.
టంగ్..పది
ఒకసారి లేచి నిజంగా టైం ఎంతయ్యిందో చూస్తే పోలా!
టంగ్.. పదకొండు
తను సెల్ ఫోన్ను దిండు పక్కనే పెట్టుకుని నిద్ర పోతుంది. చేతులతో తడుముతూ వెదకడం మొదలు పెట్టాను.
టంగ్.. పన్నెండు
పన్నెండు గంటల వరకు నిద్ర..నవ్వు రాబోయి ఆగింది. సిల్లీ! ఇందాక నుంచీ ఏవేవో ఆలోచిస్తున్నానెందుకు? అసలిది అర్థరాత్రి పన్నెండు ఎందుకు కాకూడదు? అతిగా ఊహించుకోవడం అంటే ఇదే. యిలాంటి జబ్బులు కూడా ఉంటాయని, సైకాలజీలో ఈ జబ్బులకు పేర్లు కూడా ఉన్నాయని ఎక్కడో చదివాను. కాని ఒక్కోసారి ఎంత మేధావికి అయినా ఇలాంటి పరిస్థితులు తప్పవు. అతను కూడా మనిషేగా!
టంగ్.. పదమూడు
పదమూ.. అసలు గడియారంలో పదమూడు గంటలు కొట్టే ఏర్పాటు ఉంటుందా? లేదు దానికి రిపేరు వచ్చింది. రిపేరు కాదు మానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ .
టంగ్.. పద్నాలుగు
ఎన్ని గంటలు కొడుతుంది? ఎంత దాకా కొడుతుంది?
టంగ్.. పదిహేను
తెల్లార్లూ కొడుతూనే ఉంటుందా? ఇప్పటి దాకా ఎవరూ లేవలేదు. ఇలా కాసేపు వదిలేస్తే అందరూ లేస్తారు. అందరి నిద్రా పాడవుతుంది. వెళ్ళి దాంట్లో బ్యాటరీ తీసేస్తే పోలా?
టంగ్..పదహారు
నెమ్మదిగా మంచం దిగాను.
టంగ్..పదిహేడు
హాలు లోకి అడుగు పెట్టాను. గడియారం తగిలించి ఉండే గోడ వైపు చూసాను. అక్కడ గడియారం లేదు. ఏమయ్యింది? ఎవరయినా దాన్ని వేరే రూములోకి మార్చారా..?
పిల్లల బెడ్రూంలో చూసాను. కనబడలేదు. కిచెన్లో..
చూసొద్దాం. వంట చేసేటప్పుడు సమయం తెలియాలని మా ఆవిడ కిచెన్లో పెట్టిందేమో! ..వెళ్ళి చూసాను. ఊహు! లేదు.
బాత్రూంలో..సిల్లీ!..హక్కడ ఎవరయినా..ఏమో చూద్దాం.
రెండు బాత్రూములూ వెదికాను. లేదు. మరి ఏమయ్యింది? ఒకవేళ మా బెడ్రూం లోనే ...! యా! ఎవిరి థింగ్ ఈజ్ పాజిబిల్ ఇన్ కన్ఫ్యూజన్.
వెళ్ళి మా బెడ్రూంలో మళ్ళీ చూసాను. కనబడలేదు. ఇంట్లో ఏ గోడకూ లేకుండా ఎక్కడికి పోయింది? ఏ గోడకు.. ఇప్పుడు గుర్తొచ్చింది. నేను వెదికింది గోడల పైనే. కాని అది ఏ అలమారాలోనో ఎందుకు ఉండకూడదు. నిన్నేప్పుడో మా ఆవిడ అన్న మాటలు గుర్తొచ్చాయి. గడియారం తగిలించిన చోటు అంత విసిబిల్ గా లేదని దానిని వేరే చోటుకు మారుద్దామని అంది. కర్రెక్ట్ ! వేరే చోటుకు మార్చాలని దానిని అక్కడ నుండి తీసి వుంటుంది. సమయం చాలకో, లేక మరెందుకో దానిని ఏ అలమారా లోనో పెట్టి ఉంటుంది. అనవసరంగా ఈ టైం లో దానిని వెదకడం ఎందుకు? ఎలాగు గంటలు కొట్టడం ఆపేసిన్దిగా..
పక్క మీద పడుకోబోతుండగా ఓ సందేహం. నేను లేచేదాకా గంటలు కొట్టిన గడియారం నేను లేచిన వెంటనే ఆపేసింది ఎందుకు? ...ఏమో..ఇక దీని గురించి ఆలోచించడం మానేస్తే బెటర్. పక్కకు తిరగపోతుండగా చేతికి సెల్ ఫోన్ తగిలింది. టైం చూసాను. మూడయింది. రోజూలానే మెలకువ వచ్చిందన్న మాట. నెమ్మదిగా నిద్ర పట్టింది.
* * * * * * * *
ఉదయం నిద్ర లేచి హాలులోకి వచ్చాను.
టంగ్..
చప్పున గోడవైపు చూసాను. గడియారం అక్కడే ఉంది. ఆరున్నర. అందుకే ఒక గంట కొట్టింది. కిచెన్లో వంట చేసుకుంటున్న మా ఆవిడను అడిగాను, '' గడియారాన్ని మళ్ళీ అక్కడే తగిలించావే?''
''ఏ గడియారం?''
''ఉన్నదే ఒక్క గడియారం. అదే ఆ హాలులోని గోడ గడియారం.''
''నేను తగిలించడం ఏంటి? నువ్వేగా అప్పుడు, అక్కడ తగిలించింది. ''
''అక్కడ నుంచి మార్చాలన్నావుగా? ''
''అన్నాను. అయితే ఆ పని చేసే ఓపిక నాకెక్కడిది? నీతోనే చేయిస్తా ఈ ఆదివారం .''
ఇంకా ఏదో మాట్లాడుతున్నా ..నా చెవులకు వినబడటం లేదు. హాలులోకి వచ్చి గడియారం వైపే చూస్తూ ఉండిపోయాను. ........... ........... (కల్పితం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)