పేజీలు

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నా సిమ్లా పర్యటన


('కురుక్షేత్రం ' తరువాయి..)

కురుక్షేత్ర నుండి చండీఘర్ దాదాపు 100 కి. మీ.లు. ఒకటవ నంబరు జాతీయ రహదారి పై అంబాలా వరకు ప్రయాణించి అక్కడనుండి కుడి వైపుకు 22 వ జాతీయ రహదారి గుండా చండీఘర్ చేరుకోవాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం. అంతేకాకుండా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది.

దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన మొదటి నగరం చండీఘర్. నగరం అంతా నలుచదరపు గళ్ళలాగా విభజించబడి ఉంటుంది. వీటన్నిటికి సెక్టార్ ఒకటి,రెండు,...అరవై మూడు అని పేర్లు ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రముఖ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బ్యుసర్ పర్యవేక్షణలో ఈ నగరం నిర్మిచబడింది. నివాస, పని, ఆరోగ్యం, ఆత్యాద్మిక ప్రాంతాలనే నాలుగు ప్రాంతాలుగా నగరం విభజించబడింది. నివాసప్రాంతాలలో కేవలం ఇళ్ళు, స్కూళ్ళు, చిన్న చిన్న పార్కులు ఉంటాయి అంతే. వర్కింగ్ ఏరియాలో ఆఫీసులు, పరిశ్రమలు ఉంటాయి. సెక్టార్ 17 నగరానికి గుండె లాంటిది. ఈ సేక్తార్లోనే బస్టాండ్ నుంచి పాలనా యంత్రాంగపు కార్యాలయాలన్నీ ఉంటాయి.

మేము సెక్టార్ 15 లో ఉన్న మా డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ లో దిగాం. చండీఘర్లో చూడాల్సిన ప్రదేశాలు..సుఖన లేక్, రాక్ గార్డెన్ , చండీ మాత ఆలయం.. అంతే. వీటిల్లో తప్పనిసరిగా చూడాల్సింది రాక్ గార్డెన్.

మా ప్లాన్ ప్రకారం చండీఘర్ సైట్ సీయింగ్ అనేది తిరుగు ప్రయాణంలో చేయాలనుకున్నాం. అందుకని ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం ఆరు గంటలకు సిమ్లాకు ప్రయాణం అయ్యాం.

(మిగతాది 'సిమ్లా' శీర్షికతో...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి